పెగాసస్ కుంభకోణం’ పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తున్న క్రమంలో.. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరుసగా పది రోజుల నుంచి పార్లమెంటు ఉభయసభల్లో సమావేశాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. ముందుగా పెగాసస్ కుంభకోణంపై పార్లమెంటు ఉబయసభల్లోనూ చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిజానిజాల నిర్థారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుస్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణకు అదేశించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పెగాసెస్ కుంభకోణం నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీజేపికి నిన్న స్వపక్షానికి చెందిన మిత్రపక్షం నుంచి కూడా ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ మేరకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఎలాగోలా కప్పిపుచ్చుకుందామని అని అనుకుంటున్న తరుణంలో మరో మిత్రపక్షం కూడా అలాంటి డిమాండ్ నే చేయడం బీజేపికి ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెట్టింది. దేశంలోని రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్ కాల్ లపై నిఘా పెట్టడంపై విచారణ జరిపించాల్సిందేనని అన్నారు.
తాజాగా అదే బిహార్ రాష్ట్రానికి చెందిన ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన హిందుస్తానీ అవామ్ మోర్చ (సెక్యూలార్) పార్టీ అధినేత జితన్ రామ్ మాంఘీ కూడా పెగసెస్ పై విచారణకు జరపించాలన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తీవ్ర అవరోధంగా మారిన ఈ పెగసెస్ వివాదంపై విచారణ జరగాలని అన్నారు. గత పది రోజులుగా వరుసగా వాయిదా పడుతున్నాయంటే.. అందుకు కారణం.. ఓ సిరియస్ వివాదంపై విచారణ జరపించాలన్న డిమాండ్. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలగకుండా విచారణ జరపించడమే సముచితమని ఆయన అన్నారు. ఇక దేశప్రజలకు కూడా ఎవరు ఎవరి ఫోన్ కాల్ పై నిఘా పెడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more