Key suspect in YS Viveka case In CBI Custody గోవాలో వైఎస్ వివేక హత్యకేసు ప్రధాన నిందితుడు

Ys vivekananda reddy murder case key accused in cbi custody

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

More than two years after the grisly murder of YS Vivekananda Reddy, the brother of former Andhra Pradesh CM YS Rajasekhara Reddy, the main accused in the case has been caught by the CBI. The agency's officials in a search operation caught Sunil Yadav in Goa. The process to arrest him and produce him in court is underway,

వైఎస్ వివేక హత్యకేసు: గోవాలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు..

Posted: 08/03/2021 01:42 PM IST
Ys vivekananda reddy murder case key accused in cbi custody

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఇప్పటికే 50 రోజులుగా సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సునీల్ యాదవ్ అనే ప్రధాన నిందితుడ్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్యకేసులో చార్జిషీటును న్యాయస్థానంలో సమర్పించేందుకు అన్ని సిద్దం చేసుకున్న తరుణంలో సునీల్ యాదవ్ పులివెందుల లోని ఇంటికి తాళం వేసి పరారైన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయన్న వార్తల నేపథ్యంలో అదృశ్యమైన సునీల్ యాదవ్ ను ఎట్టకేలకు సీబిఐ పట్టుకుంది. వాచ్ మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్‌ యాదవ్‌, కిరణ్ సోదరుడు సునీల్ కుమార్‌ యాదవ్‌ ను సీబిఐ విచారించింది.

వీరితో పాటు కిరణ్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి సేకరించిన కీలక సమాచారం మేరకు వివేకా హత్యకేసులో ముగ్గురికే ప్రమేయముందని కూడా తేల్చింది. ఈ కేసులో ప్రత్యక్షసాక్షి వాచ్ మెన్ రంగయ్య.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి పేర్లను అనుమానితులుగా వ్యక్తం చేయడంతో వీరిలో ఎవరు ప్రధాన నిందితుడన్న విషయాన్ని కూడా విచారించింది సీబిఐ. దీంతో సునిల్ యాదవ్ అరెస్టుకు రంగం సిద్దం చేసింది.

కాగా వైఎస్ వివేక హత్యకేసులో తన పేరు ప్రధాన నిందితుల జాబితాలో తెరపైకి రావడంతో.. వెనువెంటనే ప్లేటు ఫిరాయించిన సునీల్ యాదవ్.. హైకోర్టును ఆశ్రయించారు. సీబిఐ అధికారులు విచారణ పేరుతో తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ధర్డ్ డిగ్రీ పద్దతులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఆ తరువాతి రోజునే ఆయన అదృశ్యమయ్యాడు. తన ఇంటికి తాళం వేసిన కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ తన కుటుంబంతో పాటు కనిపించకుండాపోయాడు. దీంతో సీబిఐ అధికారులు ఆయనన గోవాలో వున్నాడని తెలుసుకుని అక్కడే అదుపులోకి తీసుకున్నారు,

వైఎస్ వివేక హత్యకేసులో సునీల్ యాదవ్ ను అరెస్టు చేయ‌డం, కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌క్రియ‌పై అధికారులు ప్రస్తుతం అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ వ‌ర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వివేకానంద హ‌త్య కేసులో విచార‌ణ జ‌రుపుతోన్న సీబీఐ అధికారుల‌కు ప‌లు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. వాటి ఆధారంగా ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్ అని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సునీల్ యాద‌వ్ త‌న కుటుంబంతో క‌లిసి గోవా‌కు పారిపోక‌ముందు ప‌లు సార్లు సీబీఐ అధికారులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles