ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్న వార్త కథనం ప్రచురితమైన క్రమంలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై పార్లమెంటులోని ఉభయసభలను కుదిపేసింది. కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పటికే విపకాల నుంచి పెరుగుతోంది. ఇక ఈ హ్యాకింగ్ ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం మాత్రం ఇవన్నీ సత్యదూరమైన వార్తలను ఖండిస్తోంది. ఈ నివేదికను కావాలనే పార్లమెంటు సమావేశాల ప్రారంభమైయ్యే రోజున విడుదల చేయించారని అనుమానాలను వ్యక్తం చేసింది.
ఇక ఇప్పటికే తన ఫోన్ అనేక సందర్భాల్లోనూ హ్యాకింగ్ కు గురయ్యిందని రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అరోపించారు. అయితే నిజంగానే హ్యాకింగ్ జరిగిందా.? వాటితోనే కేంద్రానికి నేతల సమాచారం అందుతోందా.? అన్న అనుమానాలు పశ్చిమ బెంగాల్ బీజేపి శాసనసభ్యుడు సువేందు అధికారి వ్యాఖ్యలతో బలపడుతోంది. ఎందుకంటారా.?. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ఓ బహిరంగ సభలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సువెందు మాట్లాడుతూ.. ఈస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ కే అమర్నాథ్ కాల్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని అన్నారు. మమత మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీస్ నుంచి ఎవరెవరు ఎస్పీకి కాల్ చేస్తున్నారో అన్ని రికార్డులు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటే మాకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అని సువేందు అనడం గమనార్హం. జాగ్రత్తగా ఉండాలని ఎస్పీకి సువెందు హెచ్చరికలు జారీ చేశారు.
అమర్నాథ్ అనే ఓ యువకుడు ఇక్కడికి ఎస్పీగా వచ్చాడు. అతనేంటో నాకు తెలుసు. అతనికి ఒక్కటే చెప్పదలచుకున్నా. నువ్వో సెంట్రల్ కేడర్ అధికారివి. నిన్ను కశ్మీర్లోని అనంత్ నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్ ఫర్ చేసేలా ఏ పనీ చేయొద్దని చెబుతున్నా అని సువేందు అన్నారు. సీబీఐ తర్వలోనే ఐఓలు, ఐసీలు, ఓసీల పాత్రపై దర్యాప్తు చేస్తుందని.. మమతా బెనర్జీని ఆంటీగా సంబోధిస్తూ..ఏ ఆంటీ నిన్ను కాపాడలేదు అని ఎస్పీని ఉద్దేశించి సువెందు అధికారి అన్నారు. కాగా, సువేందుపై ఉన్న ఆరోపణలపై మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2018లో ఆయన సెక్యూరిటీ గార్డ్ హత్యపై సీఐడీ, ఓ దొంగతనం కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఎస్పీ ఫోన్ కాల్ రికార్డింగ్ లు తమ వద్ద ఉన్నాయంటూ సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలపై ఈస్ట్ మిడ్నాపూర్ పోలీసులు ఆయనపై మూడు సుమోటో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాధికారులను.. బెదిరించడం,అవమానించడం,వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడం వంటి ఆరోపణలపై సువెందుపై కేసులు నమోదు చేశారు. అఫిషీయల్ సీక్రెసీ చట్టం కూడా సువెందు పై కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more