కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న పంజాబ్ కు చెందిన శిరోమణి అకలిదళ్ పార్టీ.. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల శిరోమణి అకాలీదళ్ నిరసన తెలిపింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుకుంటున్నారని, ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని తాము కోరుకుంటున్నామన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఎంపీ, కేంద్ర మాజీమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల మాట ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. ఇవాళ రైతులకు ఎవరు మద్దతిస్తున్నా.. రైతుల హక్కుల కోసం ఈ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సుమారు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు.
కాగా, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదోలుగుతూ.. కేంద్ర మంత్ర పదవిని కూడా త్యాజించిన శిరోమణి అకలీదళ్ పార్టీ.. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మాత్రం మరోమారు కేంద్రం ప్రభుత్వంతో దోస్తికి చేతులు కలిపింది. అంతేకాదు ఏకంగా కేంద్రమంత్రి పదవిని కూడా పోందిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఆగస్ట్ 13 వరకు కొనసాగనున్నాయి. రైతుల నిరసనపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ గత నవంబర్ 26 నుంచి దేశ రాజధానికి సరిహద్దు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more