ఉగ్రవాదులకు స్వర్గధామంలా పాకిస్థాన్ వుండగా.. వైరస్ లకు స్వర్ఘధామంలా చైనా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందకంటే యావత్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కరోనావైరస్ బలితీసుకుంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ పట్టణంలోని ల్యాబ్ లోనే పురుడు పోసుకుందని వార్తలు వినిపిస్తునే వున్నాయి. ఇప్పటికే రెండు దశలుగా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా... మూడో దశ కూడా వస్తుందన్న అందోళనలు నెలకొన్నాయి, అయితే ఈ అందోళనలు కోనసాగుతున్న క్రమంలోనే మరో వైరస్ కూడా చైనాలో పురుడు పోసుకుంది.
మంకీ బి వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి మరణించడం చైనాలో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే తొలి మరణం కావడంతో అందోళన మరింత పెరిగింది. ఓ 53 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చనిపోయిన కోతులను ముట్టుకోవడం ద్వారా ఆయనకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. నెల రోజుల తర్వాత కడుపులో వికారం, వాంతులు మొదలయ్యాయి. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా.. మే 27న ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ ఏంటి? ఇది ఎంత ప్రమాదకరం అన్న విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.
మంకీ బి అనేది కొత్తగా పుట్టుకోచ్చిన వైరస్ కాదని తేలింది. తొలిసారి ఈ బీ వైరస్ కారణంగా 1933లోనే ఓ లేబొరేటరీలో పని చేసే వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తిని ఓ కోతి కరిచింది. ఆ తర్వాత దానిని నుంచి కోలుకున్నా.. కొన్ని రోజుల తర్వాత జ్వర సంబంధమైన వ్యాధి బారిన పడ్డారు. మెల్లగా అసెండింగ్ మైలిటిస్ (నాఢీ సంబంధిత) వ్యాధి లక్షనాలు కనిపించి, 15 రోజుల తర్వాత మృత్యవాత పడ్డారు. అయితే ఆయన చనిపోయినా.. ఆ తరువాత కూడా పరిశీలను కొనసాగాయి. దీంతో మంకీ బి వైరస్ సోకడం ద్వారా చనిపోయిన వ్యక్తిలో ఎ రకమైన లక్షణాలతో చనిపోయాడో కూడా అధ్యయాలు జరిగాయి.
అయితే మంకీ బి వైరస్ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుంతుంది. కానీ ఇది కరోనా వైరస్ అంత వేగంగా సోకదు. ఇక గాలి ద్వారా అసలు సోకడు. ఇది ఒకరి నుంచి మరోకరికి నేరుగా తాకడం, వైరస్ సోకిన వ్యక్తి స్రవాలు అవతలి వ్యక్తిలోకి వెళ్లడం ద్వారా మాత్రమే సోకుతుంది. 1933లో తొలిసారి ఈ మాకాక్యూ బి ఇన్ఫెక్షన్ బయటపడిన తర్వాత ఇప్పటి వరకూ 20 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వీళ్లలో ఐదుగురు గత 12 ఏళ్లలోనే చనిపోయారు. వీళ్లలో చాలా మంది కోతి కరవడం లేదా గీరడం లేదా చర్మంపై ఏర్పడిన గాయం ద్వారా కోతి కణజాలం లేదా స్రవాలు శరీరంలోకి వెళ్లడం ద్వారా ఈ వైరస్ బారిన పడ్డారు.
ఇది మనిషికి సోకినప్పుడు ప్రధానంగా కేంద్ర నాఢీ వ్యవస్థపైనే దాడి చేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. దీని బారిన పడి వాళ్లలో 70 నుంచి 80 శాతం మంది మరణించారు. వైరస్ సోకిన తర్వాత 1-3 వారాల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా ఫ్లు వైరస్ లక్షణాలైన జ్వరం, చలి, కండరాల నొప్పి, అలసట, తలనొప్పి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ మహమ్మారిలా మారే అవకాశాలు చాలా తక్కువ అని పరిశోధనలు తేల్చాయి. ఒక మనిషి నుంచి మరో మనిషికి అంత సులువుగా ఇది సోకదు. దీని కారణంగా దీని వ్యాప్తి వేగం తక్కువే. దీంతో ఇది మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువ అని తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more