దేశంలో డెల్టా వేరియంట్, కరోనా మ్యుటేషన్లతో మూడో ముప్పు ముంగిట భారత్ ఉందని విదేశానికి చెందిన ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇదే అందుకు సంకేతంగా యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడం కారణంగా దేశంలో మూడో ముప్పు ఆందోళన కలిగిస్తోందని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్ధికవేత్త తన్వీ గుప్తా జైన్ తెలిపారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మూడో ముప్పు పొంచి ఉందనడానికి సంకేతాలుగా చెబుతున్నారు. రోజూవారీ కరోనా కొత్త కేసులను పరిశీలిస్తే.. మూడో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగడం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. జూన్ నెలలో రోజుకు సగటున 40 లక్షల వ్యాక్సిన్ డోసులు అందాయి. జూలై 12 నాటికి మాత్రం 34 లక్షలకు పడిపోయిందని పేర్కొంది. ఇక అదే సమయంలో కొత్త కేసులు కూడా పెరుగుతున్నాయని వివరించింది.
వ్యాక్సిన్ల కొరత కూడా కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తుందని నివేదిక వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 22.7 శాతం మంది తొలిడోసు తీసుకున్నారు. కేవలం 5.4 శాతం జనాభానే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. మరోవైపు.. దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారత్లో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 581 కొత్త మరణాలు నమోదుకాగా.. మరణించిన వారి సంఖ్య 4,11,989కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో 39,130 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,01,43,850 కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more