బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తరువాత కూడా దేశద్రోహ చట్టం అవసరం ఉందా.? ఈ స్వత్రంత భారతవనిలోనూ అలాంటి చట్టాలు అవసరమా అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. వలసవాదుల కాలంనాటి చట్టం, ఇప్పుడు కూడా కొనసాగించడంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను విచారిస్తూ న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.
రాజద్రోహం చట్టం (ఐపీసీ సెక్షన్ 124-ఎ) చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేస్తూనే.. కేంద్రం నుంచి వివరణ కోరింది. ఆ చట్టాన్ని స్వాతంత్య్ర సమరయోధులపై వాడినట్లు కేంద్రానికి కోర్టు తెలిపింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు దేశద్రోహ చట్టాన్ని బ్రిటీషర్లు (ఐపీసీ సెక్షన్ 124-ఎ) తీసుకొచ్చారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్ లాంటి వారిపై ఆ కేసులను పెట్టారని కోర్టు తెలిపింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి చట్టం అవసరమా అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వోంబాట్కెరె.. ఐపీసీలోని 124-ఎ సెక్షన్ ను (దేశద్రోహం నేరం కింద కేసు) వ్యతిరేకిస్తూ.. అది రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులకు విఘాతం కలిగిస్తోందని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తే అనేక పిటీషన్లు దాఖలైనట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అన్నింటినీ ఒకేసారి విచారిస్తామని కోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారన్నదే తమ ఆందోళన అని చీఫ్ జస్టిస్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more