దుబాయ్ లాటరీల్లో భారతీయులకు అదృష్టం కలిసివస్తోంది. నెల రోజుల వ్యవధిలో ముగ్గరు భారతీయులు దుబాయ్ లాటరీల పుణ్యమా అని కోటీశ్వరులయ్యారు. తొలుత ఓ భారతీయ వ్యక్తికి సుమారు ఆరవై కోట్ల రూపాయల లాటరీ దక్కడంతో ఆయన కోటీశ్వరుగయ్యాడు. ఇక ఆ తరువాత గతవారం రోజుల క్రితం కేరళకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ దుబాయ్ లాటరీలో తన స్నేహితులతో కలసి పెద్ద మొత్తంలో ఏకంగా ఆరు కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఇక ఇలా మన భారతీయులు ఒక ఏడాది కాలంలో ఏకంగా పదుల సంఖ్యలో దుబాయ్ లాటరీ టికెట్లు కోని కోటీశ్వరులు అవుతున్నారు.
తాజాగా మహరాష్ట్ర వాసికి భారీ లాటరీ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో మహరాష్ట్ర కు చెందిన గణేష్ షిండే 1 మిలియన్ డాలర్ల జాక్ పాట్ ను గెలుచుకున్నాడు. మన డబ్బులో అది అక్షరాల 7కోట్ల 45లక్షల రూపాయలు. మిలియనీర్ మిలీనియం సిరీస్ 363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది. షిండే స్వస్ధలం మహరాష్ట్రలోని థానే. ప్రస్తుతం నావీలో పనిచేస్తున్నాడు. అతని వయస్సు 36 సంవత్సరాలు. 1999లో ప్రారంభమైన మిలియనీర్ మిలీనియం లాటరీని ఇప్పటివరకు 180 మంది భారతీయులు గెలుచుకోగా, షిండే లాటరీని గెలుచుకున్న 181వ వ్యక్తి కావటం విశేషం.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టిక్కెట్లను గణేష్ షిండే అన్ లైన్ లో కోనుగోలు చేయడం గమనార్హం. గణేశ్ షిండే ఒక్కడే కాదు భారత్ నుంచి అనేక మంది భారతీయులు అన్ లైన్ ద్వారా ఈ లాటరీ టికెట్లను కొనేందుకు పోటీపడుతుంటారు. రాపెల్ టిక్కెట్లను కోన్నవారిలో అత్యధికులు భారతీయులే అంటే అతిశయోక్తి కాదు. అధిసంఖ్యలో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి తమ లక్ ను చాలా మంది పరీక్షించుకుంటున్నారు. ఒక మిలియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ రావటం పట్ల షిండే ఆనందం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్ధలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more