మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అధిపత్యం ప్రతర్శించుకున్నాయి. విపక్ష పార్టీల నిరసనల మధ్య ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ఏకంగా 12 మంది బీజేపికి చెందిన శాసనభ్యులపై ఏడాది పాటు వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో తాజా గణంకాల మేరకు కాకుండా పాత లెక్కల ప్రకారం ఓబీసీ కోటాను కేటాయిస్తామని అధికారంలో వున్న పార్టీలు స్పష్టం చేయడంతో ఈ అంశంపిై అసెంబ్లీలో చర్చ రసాబాసగా మారింది.
ఓబిసి కోటా అంశంపై మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. అంతటితో ఆగని బీజేపి ఎమ్మెల్యేలు స్పీకర్ భాస్కర్ జాదవ్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయనను నిలదీయడంతో పాటు దూషిండచడంతో పాటు చేయికూడా చేసుకున్నారన్న ఆరోపణలపై .. 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో దీనిపై మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాధవ్ తమకు తగినంత సమయం ఇవ్వలేదని భావించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు.
అనంతరం ఆయన క్యాబిన్లోకి వెళ్లి స్పీకర్ని దూషించడమేకాక కొట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక.. సమావేశాన్ని వాయిదా వేశారు. అసెంబ్లీ నిర్వహణలో స్పీకర్ పాత్రకు ఎంత ఔచిత్యముందో తెలుసుకోకుండా ఆయనపైనే దాడి చేసేందుకు యత్నించడం సహించరాదని అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో బీజేపి అధికారంలో వుందని.. ఆయా ప్రాంతాల్లో విపక్ష సభ్యులు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు మౌనంగా ఊరుకుంటారా.? అని ప్రశ్నించారు.
కాగా, బీజేపి పక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. స్పీకర్ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ అని అన్నారు. స్పీకర్ కూడా తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరోపించారు. అయినా మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆశీష్ షెల్కర్ స్పీకర్ కు క్షమాపణలు చెప్పారని.. దాంతో ఆ అంశం ముగిపిసోయిందని అన్నారు. ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్ జాధవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ.. దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్, సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ఎదురుగానే జరిగినా వారుకూడా అపలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more