దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఇటీవల వెలుగులోకి వస్తున్నాయని వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుక ఎప్పుడో మొదలైందని కూడా చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రెండున్నర నెలల క్రితమే వీటి ఉనికి ఆరంభమైంది. తిరుపతిలో ఏప్రిల్ లో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో తాజాగా డెల్టా ప్లస్ రకాన్ని సీసీఎంబీ గుర్తించిందని అన్నారు. కొవిడ్ రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా వేరియంట్ ను కూడా 2020 చివర్లోనే గుర్తించారని కాగా తొలుత ఈ రకం కేసులు పరిమితంగానే నమోదయ్యాయని అన్నారు.
మహారాష్ట్రలోనూ ఫిబ్రవరిలో 10 శాతంలోపే ఉన్నాయని అయితే మార్చి ఆఖరు.. ఏప్రిల్ నాటికి 80 శాతానికి చేరాయని.. ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు కూడా అలానే ఆకస్మాత్తుగా ఉద్దృతికి సృష్టిస్తాయని అన్నారు. అందుకే వాటిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఈ రకం వ్యాప్తి తీరుతెన్నులు తెలిసేవరకు జాగత్త్రలు పాటించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. కాగా, తిరుపతిలో ఏప్రిల్లో భయటపడిన డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటికే తన ఉద్దతిని చాటాలని, కానీ జరగలేదని అంటున్నారు. సదరురోగితో పాటు అతని చుట్టూ వున్నవాళ్లు జాగ్రత్తలు పాటించడంతో వ్యాప్తి ఆగిపోయి ఉండవచ్చునని అంటున్నారు.
లేకపోతే ఆ ప్రాంతంలోని నమూనాల్లో వైరస్ జన్యు పరిణామక్రమ విశ్లేషణలు తగిన స్థాయిలో జరిగి ఉండకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చునన్నారు. వైరస్ జన్యుక్రమాల ఆవిష్కరణతోపాటు వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు జాతీయ ప్రయోగశాలల్లో వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి సీసీఎంబీకి నమూనాలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వీటి జన్యు పరిణామ క్రమాలను కనుగొంటుంటారు. తిరుపతి నుంచి ఏప్రిల్లోనే నమూనాలు రాగా.. అప్పట్లోనే మ్యుటేషన్లో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వేరియంట్ను పరిశోధకులు గుర్తించారు. ఇటీవల దీనికి డెల్టా ప్లస్ రకమని పేరు పెట్టడంతో.. తాము గుర్తించిన రకం కూడా ఇదేనని జీనోమ్ కన్సార్షియం ఇన్సకాగ్కు వారు సమాచారం ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more