బీహార్ లో బాంబు పేలుళ్లకు హైదరాబాద్ లో అరెస్టులు జరుగుతున్నాయి. బీహార్ లోని దర్భంగా రైల్వేస్టేషన్ లో ఓ రైలు బోగీ నుంచి పార్శిళ్లు కిందికి దింపుతుండగా జరిగిన పేలుళ్లకు పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పనేనని భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఓ సీసా నుంచి పొగలు వచ్చి, ఆపై పేలుడు జరిగినట్టు వెల్లడైంది. దీన్ని లోతుగా పరిశోధించడంతో ఇది ఉగ్రదాడి అని నిర్థారించుకున్న భారత దర్యాప్తు సంస్థలు దీనికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం దర్యాప్తు ప్రారంభించగా దాని లింకులు హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలో ఈ కేసు విచారణను స్వీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాదులో నాసిర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరే అనుమానాస్పద పార్శిల్ ను సికింద్రాబాద్ లో బుక్ చేసినట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు. నాసిర్ ఖాన్ తొమ్మిదేళ్ల కిందట పాకిస్థాన్ వెళ్లి ఉగ్రశిక్షణ పొందాడు. రసాయనాలతో పేలుడు పదార్థాలు చేయడంలో ఆరితేరాడు. ఆపై హైదరాబాద్ వచ్చి సోదరుడు ఇమ్రాన్ తో కలిసి ఐఈడీ బాంబులు తయారుచేశాడు.
అనంతరం ఓ వస్త్రాల పార్శిల్లో పేలుడు పదార్థాలతో కూడిన సీసా ఉంచారు. దాన్ని సికింద్రాబాద్-దర్భంగా రైల్లో పంపారు. రసాయనాలు కదులుతున్న రైలు కదలికలకు పేలి మంటలు వ్యాపించి రైలు అగ్నిప్రమాదానికి గురయ్యేలా కుట్ర పన్నారు. అయితే రసాయనాలు సరైన మోతాదులో వినియోగించికపోవడంతో అది కాస్తా దర్బాంగాలో ఈ పార్శిల్ బోగీ నుంచి అన్ లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. అయితే వారు అన్నకున్నంత తీవ్రస్థాయిలో కాకుండా స్వల్పంగానే పేలుడు జరిగింది. ప్రస్తుతం ఈ సోదరులిద్దరినీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. వీరు గతంలో ఏమైనా పేలుళ్లకు కారణమయ్యాయా.? అన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న ఎన్ఐఏ అధికారులు.. ఇంకేమైనా కుట్రలు పన్నారా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more