High Court gives green signal to Anandaiahs K medicine ఆనందయ్య ‘కె’ మందును తక్షణమే పంఫిణీ చేయాలి: హైకోర్టు

Andhra pradesh high court gives green signal to anandaiahs k medicine

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, kakani govardhan reddy, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

All the hurdles cleared for Anandaiah's K medicine with Andhra Pradesh High Court gave the green signal to the medicine. It is learnt that the state government had stopped the Anandaiah's K drug in the past. Earlier, the AP government had not given permission for the drug as reports were yet to come regarding the drug being administered in eyes.

ఆనందయ్య ‘కె’ మందును తక్షణమే పంఫిణీ చేయాలి: హైకోర్టు

Posted: 06/07/2021 12:58 PM IST
Andhra pradesh high court gives green signal to anandaiahs k medicine

తన అయుర్వేద ఔషదంతో కరోనా బాధితులకు నిమిషాల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తూ పేదల నుంచి పెద్దల వరకు క‌రోనా రోగుల‌ పాలిట ఆరాద్యుడిగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తన మందును తక్షణం పంఫిణీ చేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలను జారీ చేసింది. ఈ అదేశాల నేపథ్యంలో ఆనందయ్య తన మందును ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు. ఆనందయ్య ఇచ్చే 'కె' రకం మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కాగా, కరోనా ఔషధ పంపిణీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకే సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి అవసరమయ్యే మూలికలు, సామగ్రి సరిగ్గా సమకూరడం లేదని వాపోయారు. మందును తయారు చేసేందుకు యంత్ర సామగ్రిగానీ, విద్యుత్ సదుపాయాలూ లేవన్నారు. మందు తయారీకి ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని ఆయన ఆరోపించారు. అనుమతులైతే ఇచ్చిందిగానీ సాయం మాత్రం చేయలేదన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. ఇతర ప్రాంతాల వారు రావొద్దన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇతర ప్రాంతాల వారికీ మందును ఇస్తామని చెప్పారు.

ఇక ఇటీవల ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇవాళ విచారణ సందర్భంగా న్యాయస్థానం కె మందుకు అనుమతిని ఇచ్చింది. మరోవైపు మందు పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే కాకాని గోవర్ధ‌న్‌రెడ్డి  ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు. ఇప్ప‌టికే కొవిడ్‌ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు వాడాలని, క‌రోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్‌ లోని మందు వాడాలని గోవర్ధ‌న్‌రెడ్డి వివ‌రించారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles