నైరుతి రుతు పవనాలు మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముందుగా దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్నం ప్రకటించారు. నైరుతి దిశ నుంచి దక్షిణ తెలంగాణకు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో శనివారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ నెల 3వ తేదీన దక్షిణ కేరళను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా విస్తరించాయని తెలిపారు. నైరుతి రుతుపనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు, కర్నాటకలో కొంతభాగానికి నైరుతి విస్తరించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు రుతుపవనాలు టచ్ చేశాయి. అవి క్రమంగా ఆయా రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి.
రెండు మూడు రోజుల్లో కర్నాటక, తమిళనాడు, లక్షద్వీప్లోని అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, గోవా, మధ్య అరేబియా సముద్రం, ఈశాన్య., మధ్య బంగాళాఖాతం, ఈశాన్య భారత్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోనూ, కోస్తాంధ్రలోనూ అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అనంతపురం టవర్ క్లాక్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది.
మోకాలి లోతు వర్షపునీటిలోనూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లారు స్థానికులు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో భారీవర్షం పడింది. ఈదురుగాలులు వీస్తున్న సమయంలో కారు మబ్బులు అలముకున్నాయి. అంతలోనే వర్షం కురిసింది. దీంతో వేసవి వేడి నుంచి సేదదీరారు స్థానికులు. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం కనువిందు చేస్తోంది. రెండురోజుల పాటు కురిసిన వర్షానికి.. బొగత జలపాతం నుంచి కిందకు నీళ్లు జాలువారుతున్నాయి. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్తో సందర్శకుల తాకిడి లేకుండాపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more