తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించి పోమ్మనకుండా పోగబెట్టారని, అందులో భాగంగా రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా, తన వివరణ తీసుకోకుండానే ఈ పని చేశారని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల తనకు జరిగిన అన్యాయంపై అవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వారంతా తనకు అండగా వుంటామని హామీ ఇచ్చారన్నారు. అటువంటి హుజురాబాద్ నియోజక వర్గంలో తనను ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఈటెల అరోపించారు.
‘‘బతికి ఉండగానే నన్ను బొంద పెట్టాలని సీఎం ఆదేశించడంతోనే’’ కొందరు నేతలు ఇలా చేస్తున్నారు. హుజురాబాద్ లోని నాయకులకు డబ్బుల ఆశను చూపెడుతూ, మభ్యపెడుతున్నారు. అదీ కాకపోతే అనేక రకాలుగా ఇక్కడి ప్రజాప్రతినిధులను భయాందోళనలకు గురి చేస్తున్నా’’రని అరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా.. ఎన్ని గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా వేషాలు వేసినా.. హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు ఈటెలకు అండగా నిలుస్తారే తప్ప.. మరోటి కదాన్నారు. ఇందుకు గత లోక్ సభ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. ఇక్కడి ప్రజలు తనను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని అన్నారు. తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వారే ఏదో కోల్పోయినట్లు భావించారని అన్నారు.
టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచాను అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే బీ-పామ్ తీసుకున్న ప్రతీ ఒక్కరూ గెలవరని, కేసీఆర్ సొంత కూతురు కూడా నిజామాబాద్ లో గెలువలేకపోయిందని గుర్తుచేశారు. తనను పక్కన పెట్టడం ఇప్పుడు కాదని ఆరేళ్ల క్రితం నుంచే సాగుతోందని చెప్పారు. గతంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ప్రగతి భవన్ కు వెళితే గేటు వద్దే మమ్మల్ని ఆపేశారు. రెండోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లాము. అప్పుడు కూడా గేటు వద్ద నుంచే వెనుదిరిగామని అన్నారు. బానిస కంటే నీచంగా మంత్రి పదవి ఉంది. ఎంపీ సంతోష్ కుమార్ తో తాను అప్పట్లో చెప్పానని తెలిపారు. ప్రగతి భవన్ కు ‘‘బానిసల నిలయం’’ అని పేరు పెట్టుకోవాలని కూడా బాధతో సూచించానని ఈటల తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసిన కేసీఆర్ మరోవైపు సంఘాలు, యూనియన్లే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గుగని కార్మిక సంఘాలతో కవితకు సంబంధమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు. అనేక మంది కార్మికులు అసువులు బాసిన తరువాత దిద్దుబాటు చర్యలు ఎందుకని ప్రశ్నించారాయన. అందుకనే తనపై నీచపు వార్తలు రాయిస్తూ దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ప్రజలు నిరసన తెలిపే ధర్నాచౌక్ ను ఎత్తేసి వారి గోంతు నొక్కిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు.
మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... అది చాలదన్నట్లు వారిపై నిఘా కూడా పెట్టారని అన్నారు. ఉద్యమ స్పూర్తితో ఉద్యమంలోకి వచ్చిన తనను కూడా కేసీఆర్ అగౌరవపరిచారని ఈటల మండిపడ్డారు. తాను బానిసను కాదనీ, ఉద్యమ సహచరుడినని ఆయన చెప్పారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ల ఇది వారసత్వ పార్టీ కాదని, ఇది ముమ్మాటికీ ఉద్యమ పార్టీ అని ఆయన ఉద్ఘాటించారు, ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ లేనప్పుడు ఉన్నవాళ్లు ఇప్పుడు బయటకు వెళ్లగా, కేసీఆర్ ను నువ్వెంతా అంటూ నోటికివచ్చినట్టు తిట్టినవాళ్లు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ ఆలే నరేంద్ర. మాజీ ఎంపీ విజయశాంతి, ఇప్పడు తానను దూరం పెడుతున్నారని ఈటెల అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more