ప్రేమ కోసమై సరిహద్దులు దాటి దాయాధి పాకిస్థాన్ భూమిలోకి వెళ్లిన హైదరాబాదుకు చెందిన టెక్కీ ప్రశాంత్ అక్కడ జైలులో పడి నాలుగేళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకున్నాడు. పాక్ చెర నుంచి సురక్షితంగా సొంతింటికి చేరుకున్న ప్రశాంత్ తల్లిదండ్రులను చూసి కంటతడిపెట్టుకున్నాడు. మళ్లీ మిమ్మల్ని చూస్తాననుకోలేదని, ఆ దేవుని దయ ఉంది కాబట్టే బయట పడగలిగానన్నారు. పాకిస్తాన్ జైలులో తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, చెప్పిన ప్రశాంత్.. విచారన సందర్భంగా మాత్రం బాగా కొట్టారని అన్నారు. రెండేళ్ల పాటు తనకు నరకం చూపించారని చెప్పాడు. ఆ తర్వాత క్రమంగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని తెలిపాడు.
తన లాంటి వారు మన దేశానికి చెందిన వారు ఇంకా చాలా మంది పాకిస్తాన్ లోని జైళ్లలో మగ్గిపోతున్నారని.. వారిని కూడా విడిపించాలంటూ ప్రభుత్వాలను కోరానన్నారు. పాక్ జైళ్లలో ఉంటున్న భారతీయుల వివరాలు తాను సేకరించిన వాటిని భారత ప్రభుత్వానికి అందజేశానని చెప్పారు. జైలు జీవితం తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని, భారత ఖైదీలతో పనిచేయించరు కాబట్టి తాను పుస్తకాలు చదువుతూ గడిపానన్నారు. త్వరలోనే ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతానని. తాను పడిన కష్టాలు మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పాడు.
పాకిస్తాన్ జైలు నుంచి తమ కొడుకు ప్రశాంత్ తిరిగి రావడం ఆశ్చర్యంగా.. సంబరంగా ఉందని అతని తండ్రి బాబురావు పేర్కొన్నారు. తమ కొడుకు పాక్ జైళ్లలో ఉన్నాడన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని.. మానసికంగా వర్ణించలేనంతగా నలిగిపోయామన్నారు. రాత్రయితే చాలు పీడకలలు వచ్చి భయపడేవారమని.. మళ్లీ మా వాడిని చూస్తామనుకోలేదని కంటతడిపెట్టుకున్నారు. అయితే తమ అబ్బాయిని తిరిగి రప్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సహాయత స్వచ్ఛంద సంస్థ వారు చాలా కృషి చేశారని.. వారు చేసిన మేలు జన్మలో మరచిపోలేనన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more