దేశవ్యాప్తంగా కరోనా మందుల కొరత ఏర్పడిన నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు మాత్రం వాటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున కరోనా ఔషధాలను కొనుగోలు చేసి వాటిని కోవిడ్ బాధితులకు పంపిణీ చేయడం పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా అక్షేపించింది. దేశంలో కోరత వున్న కరోనా ఔషధం.. ఫాబిఫ్లూను పెద్ద సంఖ్యలో ఎలా కొనుగోలు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనా మహమ్మారి బాధితులకు ఇచ్చే ఈ అత్యవసర మందును కొరత నేపథ్యంలో ఆయన ఎలా కొనుగోలు చేశారని నిలదీసింది.
ఈ మొత్తం వ్యవహరంలో వారం రోజుల వ్యవధిలో తమకు స్టేటస్ రిపోర్టును అందజేయాలని న్యాయస్థానం డ్రగ్ కంట్రోలర్ ను అదేశించింది. అయితే రాజకీయ నేతలు పెద్దమొత్తంలో కరోనా ఔషధాలను కొనుగోలు చేస్తున్న వ్యవహారంపై విచారణ చేస్తున్న ఢిల్లీ పోలీసులను ఈ కేసును డ్రగ్ కంట్రోలర్ కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో గంభీర్ వంటి రాజకీయ నేతలు వాటిని పెద్ద మొత్తంలో ఎలా కోనుగోలు చేశారో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర ఔషధాలను గంభీర్ పంపిణీ చేస్తుండడం వెనుక సదుద్దేశాలే ఉండొచ్చు కానీ, అది బాధ్యతాయుతమైన వైఖరి అనిపించుకోదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
గంభీర్ మాదిరిగానే మరో పది మంది కూడా తాము బాధితులకు కరోనా ఔషదాలను ఉచితంగా అందిస్తామని నిలబడే అవకాశాలు వున్నాయని, ఇది సహేతుకం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు, ఆక్సిజన్ సేకరణ, నిల్వ చేస్తున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్ లపైనా ఇలాంటి విచారణకే ఆదేశించింది. ఈ మేరకు స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ కు స్పష్టం చేసింది. ఇప్పటికే నేతలు కరోనా ఔషధాలు పొందుతున్న తీరుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సంబంధిత సమాచారాన్ని డ్రగ్ కంట్రోలర్ కు అందించాలని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more