కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయాన్ని సృష్టిస్తోన్న తరుణంలో దానిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇక పెళ్లిళ్లు కుదుర్చుకున్న యువతీ యువకులు తల్లిదండ్రులతో పాటు వధువరులు, ఈ వేడుకకు హాజరయ్యే వధూవరులు కూడా తప్పకుండా కరోనా టెస్టు చేసుకోవాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల పెళ్లి వేడుకకు హాజరైన బంధువులలో ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో తాజా అంక్షల మధ్య కళ్యాణాలు జరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఈ తరహా అదేశాలను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వమా.? లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా.? అంటే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కాదు. కానీ ఈ రాష్ట్రాలు కూడా అదే తరహాలో త్వరలో అంక్షలను అమలు చేసే పరిస్థితులు నెలకోన్నాయి. ఒడిశా ప్రభుత్వం ఈ తరహా అదేశాలను జారీ చేసిన నేపథ్యంలో అదే బాటలో పయనించేందుకు దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా వున్నాయి. తాజాగా ఈ తరహా మార్గదర్శకాలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం విడుదల చేసింది. పెళ్లిళ్లకు హాజరయ్యే బంధుజన వర్గ సంఖ్యను 20కి పరిమితం చేసిన ప్రభుత్వం.. వారందరూ తప్పనిసరిగా మూడు రోజుల వ్యవదిలోపు కరోనా పరీక్షలు చేయించుకుని వుండాలని అదేశించింది.
అయితే కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన బందుజనులు మాత్రమే పెళ్లికి హాజరుకావాలని అదేశించింది. ఈ నివేదికను ఎవరికి వారు పెళ్లి వేడుకుకు హాజరయ్యే సమయం నుంచి తిరిగి ఇంటికి చేరకునే వరకు తమతోనే తీసుకెళ్లాలని అదేశించింది. ఇక పెళ్లి వేడుకలకు తహసీల్దార్ సహా రెవెన్యూ సిబ్బంది వచ్చి తనిఖీలు చేస్తారని.. వారు వచ్చిన సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నెగిటవ్ నివేదికను బందువులు చూపించాలని అదేశించారు. అంత్యక్రియలకు కూడా 20మందికి మించి పాల్గొన రాదని, వారందరూ కర్ఫ్యూ పాస్ ను పొందాలని సర్కారు సూచించింది. కర్ఫ్యూ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనేందుకు సర్కారు అనుమతినిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more