ధేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉద్దృతంగా విజృంభిస్తుండటం.. దీని బారిన పడి రోజుకు రమారమి నాలుగు వేల మంది వరకు అసువులు బాస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అందరూ కరోనా తమకు రాకుండా ముందస్తుగా టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఒక్కసారిగా జనం దృష్టి కరోనావాక్సీన్ పై పడటంతో పాటు దేశంలోని 18 ఏళ్లు నిండిన వారకి కూడా టీకా తీసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఒక్కసారిగా వాక్సీన్ కు డిమాండ్ పెరిగింది. అయితే అప్పటికే సప్లై పెద్దగా లేకపోవడంతో అనేక చోట్ల టీకా కొరత ఏర్పడింది.
అటు ఇప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు ఇటు దేశంలోని వయోవృద్దులు అనేక మంది టీకాను తీసుకోలేదు. వీరితో పాటు నడివయస్కు వారు కూడా తొలుత పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ రెండో దశ విరుచుకుపడుతున్న క్రమంలో అందరూ ముందుగా కరోనా టీకాకు ప్రాథాన్యత ఇస్తున్నారు. టీకా తీసుకున్న వారు రెండో డోసు పూర్తైన తరువాత నెల రోజుల పాటు మద్యం ముట్టకూడదని వైద్యులు సూచనలు చేస్తున్న క్రమంలో మందుబాబులు కూడా వాక్సీన్ తీసుకుంటే మూడు నెలల తరువాతైనా మద్యం తాగవచ్చునని, లేకపోతే ప్రాణాలకే ముప్పు పోంచివుందన్న అలోచనలో వాక్సీన్ తీసుకునేందుకు బారులు తీరుతున్నారు.
ఇక అటు యువత మాత్రం వాక్సీన్ తీసుకోవడానికి ఆది నుంచి మొగ్గుచూపుతున్నా ఈ నెల 1 నుంచి మాత్రమే వారికి అనుమతి లభించింది. దీంతో కరోనా టీకాల కొరత ఏర్పడింది. అయితే తాజాగా కేంద్రం ఓ శుభవార్తను చెప్పింది. ఇప్పటికే దేశంలో కొన్ని కోట్ల మంది టీకా తీసుకున్నారని, అయితే ఇంకా అధికశాతం మంది టీకాలు తీసుకోవాల్సి వుందని చెప్పిన ప్రభుత్వం.. వారి కోసం తాజాగా ఓ శుభవార్తను అందించింది. ఈ సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకుంటారని, ఈ మేరకు డిసెంబరు నాటికి దేశంలో వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి పూర్తి రోడ్ మ్యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటించిది.
ఈ రోడ్ మ్యాప్ ఫ్రకారం జూలై నాటికి దేశంలో మొత్తం 51.6 కోట్ల వాక్సీన్ డోసులు లభ్యం కానుండగా, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని, ఈ మేరకు ప్రణాళికను రూపోందించామని తెలిపింది. దేశంలో 18 ఏళ్లు పైబడిన 95 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ కంటే అధిక సంఖ్యలోనే టీకాలను ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపింది. ఇక ఇంత పెద్దమొత్తంలో ఈ టీకాలను ఉత్పత్తి చేయడానికి ఏ విదేశం సహకారం తీసుకోవడం లేదని చెప్పిన ప్రభుత్వం.. టీకాలన్నీ స్వదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లు కాకుండా.. రాబోయే నెలల్లో ఫలితాలు చూపించడం ప్రారంభమవుతుందని చెప్పారు. భారతదేశం 175 మిలియన్లకు పైగా మోతాదులను ఇచ్చిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more