కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో విపరీతంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో పలు దేశాలు సాయాన్ని అందించి ఆక్సిజన్ ను అందించగా, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ నిర్లక్ష్యం వెన్నాడుతోంది. కరోనా బారిన పడిన రోగులకు ఊపిరి తీసుకోవడంలో ఏర్పడిన ఇబ్బందిని కేవలం ఆక్సిజన్ ఉపశమనం కల్పించి.. వారికి తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకోవడంలో ఉపశమనం కల్పిస్తున్న ఆక్సిజన్ లీక్ అవుతున్న కేసులు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. కరోనా బాధితులు ప్రాణాలను నిలిపి ప్రాణవాయువు వేల కిలో లీటర్ల మేర గాలిలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
లీటర్ల మేర ప్రాణవాయువుతో ప్రాణాలు నిలుస్తున్నాప్పడు వేల కిలో లీటర్ల ఆక్సిజన్ గాలితో కలుస్తున్న నేపథ్యంలో వేలాది మంది ప్రాణాలను కూడా కాపాడుకునే పరిస్థితిని ఈ నిర్లక్ష్యం తీస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆక్సిజన్ ను రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఏం జరిగిందో తెలుసుకున్న రోగులు బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ఇక్కడ ఎలాంటి ఘటన సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. విజయవాడ రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ ఆటోనగర్లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. అలాగే క్రితం రోజున ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. ట్యాంకర్ లోని ఆక్సిజన్ ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దాదాపుగా వంద కిలో లీటర్లకు పైగానే ప్రాణవాయువు గాలిలో వెళ్లింది. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more