పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కోంటున్న నిందితులను న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీ పేరిట రిమాండ్ విధించడం అందులో భాగంగా వారిని జైలుకి పంపే విషయం తెలిసిందే. అయితే, దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని జైళ్లన్నీ నిందితులు, దోషులతో నిండిపోతున్న నేపథ్యంలో ఇకపై నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా హౌస్ అరెస్ట్ చేయొచ్చని తెలిపింది. ఇక దేశంలోని జైళ్లన్ని పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్వహిస్తున్నారని, రానురాను జైళ్ల నిర్వహణకు ప్రజాధనం అధికంగా వినియోగం అవుతుందని పేర్కొంది.
ప్రతి సంవత్సరం జైళ్ల నిర్వహణకు రూ. 6,818.1 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్ట్ లు చేయాలని సూచిస్తున్నామని జస్టిస్ లలిత్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. అయితే నిందితులను హౌస్ అరెస్ట్ చేయడానికి వారి వయసు, ఆరోగ్యం, వారు చేసిన నేర తీవ్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. అయితే, విచారణల తర్వాత ఏం చేయాలనే విషయాన్ని న్యాయ వ్యవస్థకు వదిలేయాలని చెప్పింది.
జైళ్లు కిక్కిరిసి పోతున్నాయని, ప్రభుత్వాలకు ఖర్చు ఎక్కువవుతోందని... అందుకే ఈ సూచన చేశామని తెలిపింది. అయితే న్యాయనిపుణులు మాత్రం గృహనిర్భంధాన్ని జుడీషియల్ కస్టడీగా పరిగణించడం లేదు. భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన ఐదుగురిలో గౌతమ్ నవ్లఖ తనకు బెయిలు మంజూరు చేయాలని బొంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రింకోర్టును ఆశ్రయించగా ఇవాళ అక్కడి తిరస్కారం ఎదురైంది. అయితే తాను జుడిషియల్ కస్టడీలో భాగంగా గృహనిర్భంధంలో వున్న కాలాన్ని పరిగణించాలని ఆయన చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో విప్లవ కవి, విరసం నేత వరవరరావు కూడా అరెస్టై.. బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more