మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దంపతులు తమ దాంపత్య జీవితానికి స్వప్తి పలకనున్నారా.? అంటే గత రాత్రి వారు చేసిన ట్వీట్ మాత్రం అదే జరుగుతుందని స్పష్టం చేస్తోంది. వారు ప్రకటించిన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాను, మెలిందా ఇద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు అందులో పేర్కొన్నారు. అపర కుబేరులుగా వున్న ఆయనకు నుంచి అమె.. అమె నుంచి ఆయన విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం వెనుక కారణాలను మాత్రం వారు స్పష్టం చేయలేదు. అయితే తీవ్ర మథనం తరువాత, అనేక పర్యాయాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి తాము ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించిన తాము కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని, తమ నిర్ణయాన్ని, వ్యక్తిగత ఆకాంక్షలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు గేట్స్, మెలిందాలు పేర్కొన్నారు.
— Bill Gates (@BillGates) May 3, 2021
బిల్ గేట్స్, మెలిందాలు 1994లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65 సంవత్సరాలు. మెలిందా వయసు 56 సంవత్సరాలు. మైక్రోసాఫ్ట్ లో మెలిందా ప్రొడక్షన్ మేనేజరుగా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్గేట్స్ ఆస్తి ఫిబ్రవరి నాటికి 137 బిలియన్ డాలర్లు. మెలిందాను వివాహం చేసుకున్న తర్వాత 2000వ సంవత్సరంలో బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 53 మిలియన్ డాలర్లను ధార్మిక కార్యక్రమాల కోసం వెచ్చించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more