ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన దేశంలోని ఏ ప్రభుత్వమైనా చట్టబద్దంగా పనులు చేయాల్సి వుంటుంది కానీ.. అధికారులు ఏకపక్షంగా భారీ పోలీసుల పహారా మధ్య తన సతీమణి, తనయుడికి చెందిన హేచరీస్ లో 66 ఏకరాల అసైన్డ్ భూమి ఉందని తేల్చడం హాస్యాస్పదమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తనకు కేసీఆర్ తో వున్న అవినాభావ సంబంధం గురించి తెలుసునని, ఎవరిపైన అయినా ఆయన గురిపెడితే వారిని ఖతం చేసేదాకా అయన పంతాన్ని వీడరని అన్నారు. ఇవాళ తనకు అదే పరిస్థితిని తీసుకువచ్చేందుకు అదే పంథా కొనసాగుతుందని అన్నారు.
తన అసైన్డ్ భూముల వ్యవహారం అంతా కుట్రపూరితంగానే సాగిందని, తన భూమిలో అసైన్డ్ భూమి వుందని గత రెండు మూడు రోజులుగా అధికార పార్టీ.. తమకు చెందిన పత్రికలలో కథలు కథలుగా రాయిస్తోందని, ఎండకాలంలో దాహమేసి నీరు తాగినా.. నీరు అమ్ముతున్నాడన్నట్లుగా మీడియా కథనాలను రాసిందని అవేదనను వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలోని నా తమ్ముడు అని చెప్పుకున్న అధినేతకు తాను ఇప్పుడు ఎందుకు దెయ్యంగా కనిపిస్తున్నాడని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు పార్టీ అధినేత బాటలో కలిసి తిరిగిన తాను అప్పుడు అచరించని అవినీతి, ప్రలోభాలకు ఇప్పుడెలా లొంగుతానని భావిస్తున్నారని ఈటెల నిలదీశారు.
అయితే తన హాచరీస్ కు పొడిగించే క్రమంలో రోడ్డును విస్తరించాగా అందులో కొంత అసైన్డ్ భూమి కలిసిందని ఆయన అన్నారు. అయితే ఎన్ని గ్రామాల రోడ్డులకు, ఎన్ని పరిశ్రమల రోడ్డులకు, అసైన్డ్ భూముల్లోంచి దారి నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. తనకు ఉద్వాసన పలికే చర్యలకు శ్రీకారం చుట్టిన తరువాత కుట్రపూరితంగా తనను తప్పించారే తప్ప ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. తన భార్య జమున, తన కుమారుడు చేస్తున్న వ్యాపారంలో తనను మంత్రివర్గం నుంచి తొలగించడం ఎలా నిర్ణయమో.. ఇది పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ఇక తన హేచరిస్ లో అసైన్డ్ భూమి వుందన్న అరోపణలపై విచారణ జరపాలంటే చట్ట ప్రకారం విధివిధానాలు వేరుగా వుంటాయని ఈటెల తెలిపారు. జిల్లాకు చెందిన ఈడి సర్వే విభాగంలో పిర్యాదు చేస్తే వారు తనతో పాటు చుట్టుపక్కల వున్న రైతులను కూడా పిలిచి.. పంచుల సమక్షంలో సర్వే చేస్తారని అన్నారు. ఇక నాలా టాక్స్ పౌల్ట్రీలకు వుండదని, అది కూడా వ్యవసాయ అనుబంధం కిందకే వస్తుందని అన్నారు. అయితే చట్ట ప్రకారం కాకుండా సీఎం అదేశంతో ఆయన చెప్పినట్లుగానే వినే అధికారులు, అయన రాసించ్చిందే చదివి వినిపించినట్లుగా నివేదిక వుందని ఈటెల రాజేందర్ అరోపించారు.
తాను అరెస్టులకు, కేసులకు భయపడే వ్యక్తిని కాదని, తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారని చెప్పారు. ఎంత పెద్ద కేసులయినా పెట్టుకోండని, తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. భూములను కాజేశానంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపిన కలెక్టర్ నివేదిక తమకు అందలేదని తెలిపారు. తమ వివరణ కూడా అధికారులు అడగలేదని అన్నారు. వ్యక్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి తాను ఐదు పైసల సాయం కూడా తీసుకోలేదని, అలాగే ఐదు కుంటల భూమిని కూడా పొందలేదని చెప్పారు.
ఇవాళ మంత్రి పదవి నుంచి తప్పించిన పెద్దలు రేపు మా పార్టీ గుర్తుపైనే గెలిచారని కూడా ప్రచారం చేసుకుంటారని, అందుకని రాజీనామా చేసి మాట్లాడమని కూడా అంటారని, అయితే పార్టీ బీ-ఫామ్ ఇచ్చిన ప్రతీ వ్యక్తి గెలవరని, అయినా తాను కారు గుర్తుపైనే గెలిచానన్న అపవాదుకు దూరంగా వుండాలని భావిస్తున్నానని, అందుకోసం ఎమ్మెల్యే పదవికి కూడా త్వరలోనే రాజీనామా చేస్తున్నానని ఈటెల ప్రకటించారు. హుజూరబాద్ ప్రజల ప్రేమాభిమానాలు మెండుగా వున్న తాను.. వారితోనే కలసి తన భవిష్యత్ కార్యచరణపై చర్చించి తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more