హాప్ షూట్స్.. ఈ పేరు భారతదేశ రైతులు ఎప్పుడూ వినండరు. ఎందుకంటే రైతన్నవాడు తప్ప సమాజం కోసం మరెవరూ అంతగా అలోచించరు. సమాజంలోని ప్రతీ వాడికి అన్నం పెట్టాలనే తాను వేకువజామునే లేచి పోలానికి వెళ్లి కాయకష్టం చేసి.. పొలాన్ని చదును చేసే సమయం నుంచి పంట చేతికంది వచ్చే వరకు ఆరుగాలం కష్టించి కొద్దిపాటి లాభం చూసుకుని పంటను విక్రయించేస్తాడు. అలాంటి రైతు లాభాపేక్షతో వేసే కూరగాయల పంటలను కూడా తక్కువ ధరలకే దళారులకు విక్రయించేసి.. వాటి రేట్లు విని అంతకు అమ్ముతున్నారా.. అని అవేదన చెందుతాడు.
ఈ విషయాన్ని పక్కనబెడితే హాప్ షూట్స్ అనే పదాన్ని భారత దేశ ప్రజలకు కూడా చాలా తక్కువగానే వినింటారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. వారితో అక్కడి కూరగాయల గురించి మాట్లల్లో తెలుసుకున్నవారు తప్ప చాలా మందికి అసలు హాప్ షూట్స్.. అంటే ఏమిటో కూడా తెలియదు. అయితే ఇది ఒక రకం కూరగాయ. ఆకు కూరల తరహాలో ఇదొక పంట. అయితే అలాంటి ఇలాంటి పంట కాదు... కిలో రూ.85 వేలు పలికే సిరుల పంట. ఔనా అంటూ నోరు వెళ్లబెట్టకండీ.. దీనిని దేశవ్యాప్తంగా కేవలం ఒక్క రైతు మాత్రమే పండిస్తున్నాడు. దీనిని పెంచడానికి ఆయన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ పూర్తి సేంద్రీయ పద్దతిలో వేశాడు.
ఎవరతను.? ఏ రాష్ట్రం అంటారా..? బీహార్ లోని ఔరాంగాబాద్ జిల్లాకు చెందిన నావినగర్ బ్లాకు పరిధిలోని కరంది గ్రామానికి చెందిన అమ్రేష్ సింగ్ (38) అనే రైతు తన పొలంలో హాప్ షూట్స్ ను సాగు చేస్తున్నాడు. ఈ మొక్కలోని పువ్వు భాగాన్ని ఆహారంగా స్వీకరిస్తారు. ఈ పంట సాగు కోసం అమ్రేష్ రూ.2.5 లక్షలు వెచ్చించాడు. హాప్ షూట్స్ ను శాస్త్రీయంగా హ్యుములస్ లుపులస్ అని పిలుస్తారు. దీన్ని భారత్ లో తొలిసారిగా వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సాగు చేశారు. బీహార్ రైతు అమ్రేష్ వీటిని వారణాసి నుంచే తీసుకువచ్చి తన స్వగ్రామం కరాందీలో సాగు చేస్తున్నాడు.
ఎన్నో దివ్వౌషద గుణాలున్న కూరగాయలకు లేని ధర దీనికి ఎందుకు.. ఈ మొక్కలో ఎలాంటి గుణాలున్నాయి.? అన్న ఆసక్తి పెరుగుతోంది కదూ.. ఈ వు్వులో హ్యుములస్ లుపులస్ అనే అమ్లాలు ఉన్నాయని ఇవి మనిషిలోని కాన్సర్ కాణాలను సంహరించడంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ పువ్వులోని ఔషద రసాయన గుణాలు మనిసిలోని జీర్ణక్రియను పటిష్టం చేయడంతో పాటు మానసిక రుగ్మతలతో బాదపడుతున్నవారిని, ఎక్కువ దందుడుకు స్వాభావం వున్నవారిని కూడా ప్రశాంతత చేకూర్చుతుంది. దీంతో పాటు బీరు తయారీలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుండడంతో అంత ధర పలుకుతోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more