రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అసియా ఖండంలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముంబై ఇల్లు యాంటీలియా ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో ఇది మరో ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో అంబానీ ఇంటి ఎదుట మందుగుండు సామాగ్రితో స్కార్కియో కారును పార్కు చేసింది.. పోలీస్ అధికారి సచిన్ వాజే అని అందరూ భావిస్తున్న తరుణంలో.. మరో క్లారిటీని ఇచ్చింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). తాజాగా ఆ కారును అక్కడ పెట్టింది సచిన్ వాజే కాదని తేల్చింది. అయితే మరెవరు ఇందుకు పాల్పడివుంటారు.. అంటే.. వాజే కారు డ్రైవర్.. స్కార్పియోను తీసుకెళ్లి యాంటీలియా ముందు పెట్టాడని వెల్లడించింది.
పేలుడు పదార్థాలున్న స్కార్పియో కారును వాజే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్లగా.. దానిని తమ శాఖకు చెందిన అధికారులు ఎవరూ పట్టుకోకుండా దాని వెనుకే తెల్లటి ఇన్నోవా కారులో వాజే అనుసరించారని పేర్కొంది. ములుంద్ ఐరోలి రోడ్ లో తన స్కార్పియోను పార్క్ చేశానని, దానిని ఎవరో దొంగిలించారని హత్యకు గురైన ఆ కారు యజమాని మన్సుఖ్ హిరెన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, సచిన్ వాజే ఆదేశాలతో డ్రైవర్ ఆ కారును తీసుకొచ్చి వాజే ఇంటి ముందు పెట్టారని ఎన్ఐఏ దర్యాప్తులో పేర్కొంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19న హెడ్ క్వార్టర్స్ కు, మర్నాడు మళ్లీ వాజే నివాసముంటున్న సొసైటీకి తీసుకెళ్లాడని తెలిపింది.
ఫిబ్రవరి 24 వరకు అక్కడే ఉన్న కారును.. ఫిబ్రవరి 25న యాంటీలియా ముందు డ్రైవర్ పార్క్ చేశాడని వెల్లడించింది. కారును ఫిబ్రవరి 25న రాత్రి 10 గంటలకు పార్క్ చేసిన తర్వాత.. డ్రైవర్ ఆ కారు దిగి వాజే వచ్చిన ఇన్నోవాలో ఎక్కాడని పేర్కొంది. ఆ తర్వాత ఇన్నోవాలో నుంచి తెల్లటి కుర్తా వేసుకున్న వాజే దిగారని, నేరుగా బాంబులు పెట్టిన కారు దగ్గరకు వెళ్లి బెదిరింపు లేఖను వదిలేసి వచ్చారని తెలిపింది. ఆధారాలను లేకుండా చేసేందుకు హెడ్ క్వార్టర్స్ లోని రెండు డీవీఆర్లు, సాకేత్ సొసైటీలోని ఒక డీవీఆర్ (సీసీటీవీ ఫుటేజీ)ను వాజే నాశనం చేశారని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more