బీజేపి సీనియర్ నాయకుడు, విశ్వహిందూ పరిషత్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ జన్మకు సిగ్గుందా.? యాక్ తూ.. నువ్వు ఒక పోలీసు కమీషనర్.. ఛీ అంటూ దారుణంగా విరుచుకుపడ్డారు. తమ పార్టీయే అధికారంలో వున్నా.. వారి దయతోనే మైసూరు పోలీస్ కమీషనర్ గా డాక్టర్ చంద్రగుప్తా కొనసాగుతున్నా.. వాటన్నింటినీ తోసిరాజుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో జరిగిన ఓ ఇంజనీరు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రశంసించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మైసూరు రింగ్ రోడ్డుపై వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాపిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక బైక్ రైడర్ అందులోనూ ఇంజనీర్ అయిన వ్యక్తి ప్రమాదానికి గురై మరణానిస్తే.. అందుకు కారణమైన ట్రాపిక్ పోలీసులను ప్రశంసించిన పోలీస్ కమీషనర్ చంద్రగుప్తపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ జన్మకు సిగ్గంటూ వుందా.? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రమాదానికి కారణమయ్యారని స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. వారిని చితకబాదారు. ఈ ఘటనలో ఎవరిది తప్పు.. ప్రజలు తిరగబడేంత తప్పు జరిగిందంటే.. అసలేం జరుగుతుంది.? అన్న ఘటనపై విచారణ వేయాల్సిన అధికారి.. పోలీసులను ప్రశ్నింసించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నగర పోలీసు కమీషనర్ గా నువ్వు రోడ్డుపైకి వచ్చేది లేదు.. నగరంలో ఏం జరిగుతుందో పట్టించుకునేది లేదు. అసలు నువ్వు రోడ్డపైకి వచ్చి నగరంలో ట్రాఫిక్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో.. ఎలా తగ్గుతుందో కూడా తెలుసుకోవు. సిటీలో రౌండ్స్ వేయవు. నువ్వు మైసూర్కు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది. నీ కింద ఎంతమంది సిసిపీలు, ఏసీపీలు పనిచేస్తున్నారు? అంతమందిని పెట్టుకుని కూడా నగరంలో ట్రాఫిక్ ను నువ్వు నియంత్రించలేక పోతున్నావా.? అసలు మైసూరు నగర ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం రాదా.? అని మండిపడ్డారు.
ప్రజలనే కాదు.. వారి తరపున మాట్లాడే ప్రజా ప్రతినిధులన్నా గౌరవం లేదా.? అని ప్రశ్నించారు. మైసూరు పోలీస్ కమీషనర్ అయిన తరువాత నువ్వు ఎన్ని సార్లు నగరంలో పర్యటించావు..? అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు నువ్వు ప్రజలను కలిశావు.? ఎన్ని సార్లు వారి అవేదనను స్వయంగా కలిసి విన్నావు.? కుర్చీలో కూర్చోని అదేశాలను ఇవ్వడమే కాదు.. నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని విశ్వానాథం సూచించారు. నాలుగు రోజుల క్రితం మైసూర్ నగరంలో జరిగిన ఓ ఇంజనీరు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోకుండా వారికి మైసూరు పోలీసు కమీషనర్ ప్రశంసాపత్రాలను అందించడంతో ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more