దేశ రాజధాని ఢిల్లీలో సినీపక్కిలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుడ్ని విడిపించేందుకు సదరు గ్యాంగ్ స్టర్లు దాడులకు పాల్పడడం అనేక పాత చిత్రాల్లో వచ్చిందే. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం అలాంటివి చిత్రాల్లో కనబడటం లేదు. అందుకనే నిజంగా చేసి చూపుదామని భావించారో ఏమో తెలియదు కానీ.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. కుల్ దీప్ మాన్ అలియాస్ ఫజ్జా ఓ కరడగట్టిన నేరస్తుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జతిందర్ మాన్ అలియాస్ గోగి ముఠాలో కీలక సభ్యుడు.
అయితే గతేడాది జితేందర్ మాన్ అలియాస్ గోగిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీలోని గురుగ్రామ్, సెక్టార్ 82 లోని మాప్స్ కో కాసబెల్లా అపార్ మెంట్స్ లో అరెస్టు చేశారు.. అతనితో పాటు అతని ముఠాసభ్యులైన మరో ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు. వీరిలో కులదీప్ మాన్ కూడా వున్నాడు. వీరందరూ పలు విధాలుగా జైలు నుంచి బయటకు వచ్చాయి. కాగా ఇప్పటికీ జైలులో వుంటూ అరోగ్యం క్షీణించిన కుల్ దీప్ మాన్ అలియాప్ ఫజ్జాను పోలీసుల నుంచి తప్పించాలని ప్లాన్ చేశారు. అనారోగ్యం బారినపడడంతో పోలీసులు ఎస్కార్టు సాయంలో కుల్ దీప్ ను ఢిల్లీ జీటీబీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న గోగి ముఠా సభ్యలు ఓ స్కారియో వాహనంతో పాటు మరో బైక్ పై వచ్చి.. పోలీసుల కంటే ముందుగానే ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రి వద్దకు చేరుకుని వాహనాల్లో కాపు కాశారు. కుల్ దీప్ ను తీసుకువస్తున్న పోలీసు వాహనం ఆసుపత్రికి వద్దకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ కు గురైన పోలీసులు.. వెంటనే తేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక గ్యాంగ్ స్టర్ మరణించాడు. మరో గ్యాంగ్ స్టర్ గాయపడ్డి పోలీసులకు చిక్కాడు. అయితే, ఈ ఘటనలో జతిందర్ గ్యాంగ్ అనుకున్నది సాధించింది. పోలీసుకస్టడీలో ఉన్న కుల్దీప్ ను విడిపించుకుని అక్కడ్నించి పరారైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more