భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో తెలుగవాడైన జస్టిస్ ఎన్వీ రమణ త్వరలో అసీనులు కాబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ రాశారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే వచ్చే నెల ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనను కోరింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు జస్టిస్ బోబ్డేకు లేఖ పంపుతూ అందులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎన్వీ రమణను తన తరువాత ఆ పదవిలో నియమించాల్సిందిగా ప్రతిపాదించారని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రక్రియ ప్రకారం బోబ్డే ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26న రిటైర్ అవుతారు.
ఎన్వీ రమణ 1957, ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని ఓ వ్యవసాయం కుటుంబంలో జన్మించారు. 2000, జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితుడయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, జస్టిస్ బోబ్డే 2019 నవంబరులో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ (రిటైర్డ్) రంజన్ గొగొయ్ స్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఆయన ప్రతిపాదించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more