అతిగా మద్యం సేవించిన వ్యక్తి అదే కారణంతో చనిపోతే అతని కుటంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇలాంటి ఘటనల్లో మృతుడి వారసులకు పరిహారం కూడా చెల్లిందాల్సిన అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైన తీర్పును వెలువరిచింది. ఈ కేసు విచారణ సందర్భంగా జాతీయ వినియోగదారుల కోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాంలోని సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997లో మరణించాడు. ఆయన రాత్రి పూట ఉద్యోదానికి వెళ్లి మరుసటి రోజున మృతిచెంది కనిపించాడు. అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకన్న పోలీసులు ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా మృతుడు అతిగా కురిసిన వర్షాలతో పాటు తీవ్ర చలికి మరణిచాడని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని అతడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
అయితే, అతడు అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అతని గొంతు నుంచి జీర్ణకోశం వరకు అతిగా మద్యం సేవించిన కారణంగా కుచించుకు పోవడంతోనే అతని మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో పోందుపర్చివుంది. దీంతో సంస్థ చేసిన బీమా అతడికి వర్తించదని.. కేవలం ప్రమాదంలో చనిపోయిన వారికి మాత్రమే అది వర్తిస్తుందని.. వారికే తాము పరిహారం కూడా చెల్లిస్తామని అది జనతా భీమా అని బీమా సంస్థ తేల్చిచెప్పింది. దీంతో మృతుడి వారసులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వినియోగదారుల ఫారంలో ఇరువర్గాల వారి వాదనలు విన్న తరువాత న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.
దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్లతో కూడిన ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇక ప్రమాదం కాదు కాబట్టి పరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more