మేడ్చల్ జిల్లాలో బిటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పేట్ బషీరాబాద్ లో ప్రాంతంలోని ఓ హాస్టల్ లో ఇటీవలే చేరిన చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రికది ఆత్మహత్యా.? లేక హత్యా అన్న విషయంలోనూ కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా స్థానికంగా లభించిన ఓ సీసీటీవీ ఫూటేజీలో మాత్రం చంద్రిక తెల్లవారు జామున ఒంటరిగా తన హాస్టట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు నిక్షిప్తమై వున్నాయి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రిక.. కరోనా కారణంగా కాళాశాలు అన్ని మూతపడటంతో గత ఏడుఎనమిది నెలలుగా తల్లిదండ్రులతో కలసి ఇంట్లోనే వుంది. కాగా పరీక్షల నేపథ్యంలో గత నెల ఫిబ్రవరి 4న మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో చేరింది. అక్కడే నివాసం వుంటూ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో అమె హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అమె శరీరంపై ఎలాంటి రక్తపు గాయాలు కూడా లేవని, హాస్టల్ పై నుంచి దూకినా అమె మృతదేహం మాత్రం మరికోంత దూరంలో లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చంద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్ల్యాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more