దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నెల తొలినాళ్లలో నమోదైన స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు కావడం దేశప్రజల్లో అందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 46,951 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా వాటిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన గణంకాల ప్రకారం... దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది. కాగా, కొత్తగా 21,180 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
గడచిన 24 గంటల సమయంలో 212 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,967కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,51,468 మంది కోలుకున్నారు. 3,34,646 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,50,65,998 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇక మహారాష్ట్ర తరువాత పంజాబ్(2,644), కేరళ (1,875), కర్ణాటక (1,715), గుజరాత్ (1,580) రాష్ట్రాలలోనూ అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,03,455కి చేరింది.
ఈ మేరకు తెలంగాణ వైద్యఅరోగ్యశాఖ ఇవాళ ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాబారిన పడిన ఇద్దరు అసువులు బాసారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 181 మంది రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య రెండు లక్షల 98 వేల 826కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2958 కేసులు యాక్టివ్ గా వుండగా, వాటిలో 1226 కేసులు హోం ఐసోలేషన్ లో చికిత్సను పోందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more