జమ్మాకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్లో నలుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం వేకువ జాము నుంచే ప్రారంభమైన కాల్పులతో మనిహాల్ గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల శబ్దాలతో గాఢనిద్రలో పురజనులను నిద్రలేచి ఏం జరుగుతుందో తెలుసుకునే ధైర్యం కూడా చేయలేకపోయారు.
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇవాళ వేకువజామునే ఆ ప్రాంతానికి చేరకుని అక్కడి బస్తీల్లో తనిఖీలు చేశారు. ఆ ప్రాంతానంతా దిగ్భంధించి వలయంలా ఏర్పాడి గ్రామంలో అణువణువూ తనిఖీ చేశారు. ఇది గమనించిన ఉగ్రవాదలు ఒక ఇంట్లోంచి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో వెనువెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పుల జరిగిన ఘటనా స్థలంలో తొలుత ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే కొద్దిపేవు ఉగ్రవాదుల నుంచి ఎలాంటి కాల్పులు లేకపోవడంతో వేచి చూసిన తరువాత మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. అప్రమత్తంగా వున్న భారత భద్రతా దళాలు మరోమారు ఎదురుకాల్పులతో నక్కిన ఉగ్రవాదలును అంతమొందించారు. కాల్పుల తర్వాత వెళ్లి మొత్తంగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, మూడు పిస్టల్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more