తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించే అధికారం కూతురుకి ఉందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన తండ్రి రెండో వివాహం విషయమై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన ఓ 66 ఏళ్ల కూతురు పిటీషన్ పై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు.. కూతురిగా తండ్రి రెండో వివాహం చెల్లుబాటు విషయమై ప్రశ్నించే అధికారం తనయకు ఉంటుందని తీర్పును వెలువరించింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందినది కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది.
బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్డి ధనూక, జస్టిస్ విజీ బిషత్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఓ కూతురుకి.. తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ప్రశ్నించే అధికారం వుందని 66 ఏళ్ల మహిళ వేసిన పిటీషన్ ను సమర్థించింది. తన తండ్రి 2003లో తన తల్లి మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నాడని, అయితే అతను 2016లో చనిపోయిన తరువాత ఆయన రెండో భార్య తన మొదటి భర్త నుండి విడాకులు పోందలేదని తెలిసిందని, ఈ క్రమంలో తాను తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ప్రశ్నించదలిచానని పిటీషన్ వేసింది.
ఈ పిటీషన్ పై ఫ్యామిలీ కోర్టు.. వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ముడిపడిన ఆంశమని.. భర్త లేదా భార్య తేల్చి మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ అమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది. తన తండ్రి ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తుందని.. అసలు ఈ వివాహం ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఆ కూతురు బాంబే హైకోర్టుకి వెళ్లగా అక్కడ ఆమెకి ఊరట లభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more