దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఇకపై ప్రభుత్వాలు నడపలేమని.. దేశంలో వాటిని వ్యవస్థాపన జరిగిన నాటి పరిస్థితులు వేరు.. ప్రస్తుత పరిస్థితులు వేరు అని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకోరని స్పష్టంగా సంకేతాలు ఇచ్చారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయడం సమంజసం కాదని, వ్యాపారం పేరుతో యువ మేధావులను ప్రభుత్వం వదులుకునేందుకు తాము సిద్దంగా లేదని ప్రధాని గంటాపథంగా చెప్పారని గంటా అన్నారు.
ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు తాజాగా ప్రధాని వ్యాఖ్యలపై బీజేపి నేతలను టార్గెట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై తమ నిర్ణయం మారదని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. బీజేపి నేతలు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రభుత్వ రంగం సంస్థలను ఇకపై భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామని అంటున్నారు. కానీ అబ్బే, అలాంటిదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రులను మభ్యపెడుతున్నారు. నిన్న ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన ఓ వెబినార్ లో... ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విధంగా ప్రధాని మాట్లాడారని’’ అని అన్నారు. అయినా రాష్ట్రానికి చెందిన బీజేపి నేతలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదని.. ఇప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అసాథ్యమని అంటున్నారని ఆయన పేర్కోన్నారు.
ప్రైవేటీకరణపై నోటిఫికేషనే రాకుండానే ఉద్యమాలు ఎలా చేస్తారని బీజేపి రాష్ట్ర నాయకులు కాలయాపన మాటలు చెబుతున్నారని గంటా శ్రీనివాస్ విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడాలని.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా వెంటనే కార్యాచరణ ప్రకటించాలని గంటా డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా మేల్కొనాలని, పదవుల కోసం కాకుండా ప్రాంతం (విశాఖ ఉక్కు కర్మాగారం) కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. 'రండి, ఏకతాటిపై నిలిచి మన విశాఖ ఉక్కును కాపాడుకుందాం' అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more