చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే తరహాలో ఇంధన ధరలు వుండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వర్తక సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్) పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దీనికి తోడు నూతన వే బిల్లులో పలు సవరణలు చేయాలని కూడా వర్తక సమాఖ్య డిమాండ్ చేస్తోంది. అటు జీఎస్టీని కూడా సవరించాలని వర్తక సమాఖ్య కేంద్రం ముందు తమ డిమాండ్లను ఉంచింది.
దేశ వ్యాప్తంగా ఏకంగా 40 వేల వర్తక ట్రేడ్ అసోసియేషన్లు ఈ బంద్ లో పాల్గోంటున్నాయి. దీనికి తోడు ఈ బంద్ కు చార్టర్డ్ అకౌంటెంట్ యూనియన్లు కూడా మద్దుతు ప్రకటించడంతో వర్తకులకు పిలుపు బలం చేకూరింది. ఇక మరోవైపు ఈ బంద్ కు లారీ యజమానుల సంఘంతో పాటు ఈ బంద్కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) తమ మద్దతు పలికింది. ఇందులో భాగంగా చక్కాజామ్కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా అంతరాష్ట్రాల మధ్య నడిచే దాదాపు నలభై లక్షల వాహనాలు కూడా ఇవాళ రోడ్లపైకి రావని తెలిపింది.
ఇక మరోవైపు భారత్ బంద్ కు ఉత్తర భారతంలోని రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరలు, గ్యాస్ ధరలతో పాటు జీఎస్టీని సవరించాలని, ఇక అత్యంత కీలమైన ఈ వే బిల్లులోని పలు చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిని వెంటనే తగ్గించాలని, ఏటా టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని స్పష్టం చేశారు.
భారత్ బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రోడ్లపైకి భారీ వాహనాలు రావడం లేదు. ఒడిషాలోని భువనేశ్వర్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం వాహనాల రద్దీతో నిండే రోడ్లు ఇవాళ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటల వరకు బంద్ కోనసాగుతుందని వర్తక సమాఖ్య తెలిపింది. అయితే బంద్ కారణంగా అత్యవసర సేవలతో పాటు మెడికల్ దుకాణాలు, పాలు, కూరగాయలు, బ్యాంకు సేవలకు ఎలాంటి అంతరాయం కలగించబోమని వారు తెలిపారు. ఇక 2018 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ వే బిల్లులో పలు సవరణలు చేయాలని.. ఈ బిల్లులో కేంద్రం సూచించిన విధానాలు అచరణ సాధ్యం కాదని రవాణ సంఘం నేతలు తేల్చిచెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more