విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. తన వద్ద విద్య నేర్చుకుంటున్న విద్యార్థినిపై కన్నువేశాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఫస్ట్ ర్యాంకు ఇస్తానని మాయమాటలు చెప్పి అమెను వారి ఇంట్లోని వారికి తెలియకుండా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అమెతో శారీరికంగానూ కలిసాడు. తమ అచూకీ ఎవరికీ తెలియదని భ్రమపడి తన మకాన్ని ఖమ్మం జిల్లా ఇల్లెందుకు మార్చాడు. అయినా పోలీసులు అతని సెల్ ఫోన్ సిగ్నెల్ ఆధారంగా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. 2016లో జరిగిన ఈ ఘటనలో విచారణ అనంతరం తాజాగా నిందితునికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
వివరాలు... ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెత్తార్లపల్లికి చెందిన మైనర్ బాలిక గణపురంలోని ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2016 వేసవి సెలవుల్లో ఆమె గణపురంలోని మేనత్త ఇంటికి వెళ్లింది. ఏప్రిల్ 29న ఇంటినుంచి అదృశ్యమవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణపురం పోలీసులు విచారణ చేపట్టి ఆమె సెల్ ఫోన్లోని మెసేజ్ల ఆధారంగా సాయిమణిదీప్ నంబర్ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పిన సాయిమణిదీప్ 2016 ఏప్రిల్ 29న బాలికను తనతో తీసుకువెళ్లాడు.
అనంతరం మే 9న ఖమ్మం జిల్లా ఇల్లెందులోని కోటమైసమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు ఇల్లెందులోని లాడ్జికి తీసుకెళ్లి బాలికను లొంగదీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆమెను హన్మకొండలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. 2016 మే17న మణిదీప్ ఇంటినుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె వాంగ్మూలం ఆధారంగా మణిదీప్తో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో ప్రధాన నిందితుడు శివగాని సాయిమణిదీప్కు వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.జయకుమార్ పదేళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more