పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా అదేశాలను జారీ చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన అదేశాలను న్యాయస్థానం సమర్థించింది. ఓట్ల లెక్కింపును ప్రక్రియను వీడియో తీయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏదైనా పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా సంబంధిత పంచాయతీలో వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామపంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎస్ఈసీని అదేశించిన న్యాయస్థానం.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేయాలని లేదా వీడియో తీయాలని ఎస్ఈసీ ఈనెల 13న ఇచ్చిన ఉత్తర్వులను అమలు కావడం లేదని, వాటిని అమలుపర్చేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది.
ఇప్పటికే రెండు విడతల కౌంటింగ్ ముగిసినా న్యాయస్థానం జారీచేసిన అదేశాలు అమలు కావడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ఎం.ప్రతాప్ నాయక్ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈనెల 17, 21 తేదీల్లో జరగనున్న మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. దీంతో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో విధానం తెలుసుకున్న తరువాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more