మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు జిల్లా అధికారులు. భారీ క్రేన్ల సాయంతో కాలువలో పడిన బస్సును మూడు గంటల పాటు శ్రమించి తీసిన అధికారులు బస్సులో కొన్ని మృతదేహాలను కూడా వున్నట్లు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన గజఈతగాళ్లుతో పాటు ఎన్డీఆర్ఎష్ బృందాలు ఘటనాస్థంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఏకంగా 45 మృతదేహాలను వెలికి తీసిన సిబ్బంది.. మరకొందరు కూడా గల్లంతయ్యారన్న వార్తలు నేపథ్యంలో కాలువలో గాలిస్తున్నారు.
బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 42మంది జలసమాధి అయ్యారు. వీరిలో 24 మంది పురుషులు, 20మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇవాఠ ఉదయం 8.30గంటల సమయంలో సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొలుత 18మంది మృతిచెందినట్టు వార్తలు వచ్చినప్పటికీ సహాయక చర్యల్లో మరిన్ని మృతదేహాలను గుర్తించారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో ఇంకొందరు గల్లంతయ్యారు.
ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్ రాజేశ్ జైన్ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ లో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
దుర్ఘటన నేపథ్యంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.. ఇద్దరు మంత్రులు ఘటనా స్థలం వద్దకు పంపి సహాయక చర్యలను పరిశీలించాలని అదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కేంద్రప్రభుత్వం తరపున రూ.2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. భాదిత కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more