ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్, సామూహిక చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో బాధితురాలు చెప్పినదానిలో ఏమాత్రమూ నిజం లేదని.. అమె తల్లి నుంచి వేరుగా వెళ్లాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఆడిన నాటకమని, ఇదంతా ఓ కట్టుకథని తేల్చారు రాచకొండ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కంటిమీద కునుకు కరువైయ్యేలా చేధించిన కేసు చివరకు కట్టుకథగా తేలడంలో వారి కష్టానికి ఫలితం లేకుండా చేసింది.
రాచకొండ పోలీసు కమీషనర్ మోహన్ భగవత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. యువతి కిడ్నాప్ ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని తెలిపారు. పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. బాధిత యువతి తల్లి పిర్యాదు మేరకు తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో తాము అలర్ట్ అయ్యామని, కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు.
అందిబాటులోకి వచ్చిన సాంకేతికతతో (సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా) యువతిని ట్రేస్ చేశామని తెలిపిన ఆయన ఆ మరుసటి రోజున విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలకు రేకెత్తాయని అన్నారు. యువతి చెప్పిన అటో డ్రైవర్.. అతని స్నేహితులను విచారించి.. వారు తెలిపిన వివరాల ప్రకారం , సీసీటీవీ ఫూటేజీ పరిశీలించగా వారు చెప్పింది నిజమని తేలిందని.. ఈ నేపథ్యంలో మరోమారు యువతిని విచారించగా, తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని.. చెప్పిందని అన్నారు,
దీంతో మరోమారు బాధితురాలని వైద్యపరీక్షలకు తీసుకెళ్లి రక్తంలో మత్తుమందు ఏమైనా కలిసిందా..? అన్న కోణంలోనూ పరిశీలించినా.. అలాంటిదేమీ లేదని తేలిందని వైద్య నివేదికలు వెల్లడించాయన్నారు. ఇక దీంతో యువతి చెప్పిన కథనాల ప్రకారం అమె దిగిన రాంపల్లి నుంచి సీసీటీవీ ఫూటేజీలు పరిశీలించగా.. అమె ఒక్కతే భుజాన బ్యాగు వేసుకుని రోడ్డుపై దాదాపుగా నాలుగు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లిందన్నారు. ఆ తరువాత ఓ అటోను ఎక్కి అన్నోజీగూడ వద్ద దిగి.. అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో పొదల్లోకి పరుగెత్తిందని అన్నారు.
ఈ క్రమంలో కిందపడటంలో కాలికి దెబ్బ తగిలిందని.. అయినా లేచిన యువతి మరికొంత దూరం పోదల్లోకి వెళ్లి అక్కడ తన దుస్తులను తానే చించుకుని.. తనపై అత్యాచారం జరిగినట్టుగా సీన్ ను క్రియేట్ చేసిందని తెలిపారు. పూటేజీని చూపించి విచారించిన తరువాత యువతి తన దుస్తులను తానే చించేసుకుందని అంగీకరించిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్ భగవత్ తేల్చిచెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more