Revanth Reddy open letter to CM KCR సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

Revanth reddy open letter to cm kcr in support of farmers

Revanth Reddy padayatra, Revanth padayatra from Yellikal, Acchampeta to Hyderabad, congress padayatra, sitakka, mallu Ravi, vamshi chander reddy, Congress, Revanth reddy, Rajiv Rythu Bharosa deeksha, Revanth reddy padayatra, Achampeta, Mahaboobnagar, Telangana, Politics

Congress working president and MP A Revanth Reddy begins his Rajiv Rythu Bharosa padayatra on Sixth day asking to pass a resolution in the Assembly opposing the new farm laws introduced by the Central government.

రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

Posted: 02/12/2021 08:55 PM IST
Revanth reddy open letter to cm kcr in support of farmers

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజు కోనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నుంచి ఆదివారం ప్రారంభమైన ఆయన పాదయాత్ర.. ఆరవ రోజుకు చేరుకోగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తాను చేస్తున్న రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా అన్నదాతలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన లేఖలో పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతుల వెన్నుముక్క విరిచే ఆ చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోనని అసెంబ్లీలో సీఎం తీర్మాణాన్ని ప్రతిపాదించి అమోదించాలని, అమోదించిన ప్రతిని పార్లమెంటుకు కూడా పంపాలని రేవంత్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయల రుణమాఫీ చస్తానని రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ రెండేళ్లు గడిచినా ఇంకా ఎందుకు అమల్లోకి రాలేదని ఆయన ప్రశ్నించారు. దీంతో అన్నదాదలను బ్యాంకులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. తక్షణం రుణమాఫీ నిధులను విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.  

ధరిణలో వివరాలు నమోదు కాలేదని తొలివిడతలో రైతు బంధు నిధులు అందిన రైతులకు రెండో విడత నిధులు వేయడం లేదని.. ఇలాంటి రైతులకు కూడా తక్షణం న్యాయం జరిగేలా నిధులు అందేటా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సన్నబియ్యం పండించగా గిట్టుబాటు ధర లేక, అటు తేమ కారణాలతో పెట్టుబడి, శ్రమకు ఫలితం కూడా దక్కడం లేదని అన్నారు., తెలంగాణలో 25 లక్షల యూరియా రైతులకు ఉచితంగా ఇస్తామని 2017లో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతులు యూనియా లభించక ఇబ్బందులు పడుతున్నారని, యాసంగి నాట్లు వేసి యూరియా కోసం ఎదురుచూస్తున్నారని రేవంత్ రైతులు సమస్యలను ఏకరువు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles