తనకు హెలికాప్టర్ కావాలంటూ.. దానిని కొంచెం కొనిపెట్టండి సారూ.. అంటూ ఓ మహిళా రైతు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసింది. ఔనండీ.. ఇప్పుడీ మహిళఆ రైతు లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇటు సోషల్ మీడియాలో అటు రాష్ట్రమీడియాలో అమె లేఖ పెను సంచలనంగా మారింది. దీంతో స్థానిక అధికారులతో పాటు అమె నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా వెనువెంటనే స్పందించారు. తాను అమెకు సాయం చేసి పెడతానని కూడా హామీ ఇచ్చారు. ఇంతకు అంత ఆఘమేఘాల మీద అధికారులు, శాసనసభ్యుడు స్పందించేందుకు కారణమేంటి.?
ఈ ప్రశ్నలను తెలుసుకునేందుకు ముందు అసలు ఈ మహిళా రైతుకు హెలికాప్టర్ తో ఏం పని.. అమెకు అంతటి అవసరమేంటి.. అన్న ప్రశ్నల్లోకి ఎంట్రీ ఇస్తే కానీ అసలు వివరాలు తెలియవు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్సౌర్ జిల్లాలొని బర్ఖేడా గ్రామంలో బసంతి బాయి అనే మహిళా రైతు నివసిస్తున్నారు. ఆమెకు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే ఆ పొలానికి వెళ్లేందుకు దారి లేదు. దీంతో అమె ఇతరుల పొలాలను దాటుకుంటూ వరాల మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఇతర పొలాల వాళ్లు ఆమెను రానివ్వడం లేదు.
ఈ సమస్యను పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు బసంతి బాయి. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె నేరుగా రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఇలా ఉంది. ‘అయ్యా మాది బర్ఖేడా గ్రామం. నాకు ఈ గ్రామంలో పొలం ఉంది. కానీ పొలానికి వెళ్లడానికి మార్గం లేదు. ఇతరులకు చెందిన పొలాలను దాటుకుంటూ వెళ్లాలి. నన్ను పొలాల గుండా రానివ్వడం లేదు. మీరు దయతలిచి హెలికాప్టర్ ఇప్పిస్తే నేను హెలికాప్టర్లో నా పొలానికి వెళ్తా’ అంటూ ఆమె లేఖ రాసింది. ఈ లేఖ సోషల్మీడియాలో తెగవైరల్ అవుతోంది.
బసంతి బాయి తన సమస్య అధికారులకు చెప్పేందుకు స్థానికంగా ఉండే ఓ టైపిస్ట్ సాయంతో ఈ లేఖ రాయించింది. ఈ లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్ పాల్ సింగ్ హెుటాహుటిన స్పందించారు. ఈ విషయంపై యశ్పాల్ మాట్లాడుతూ.. ‘సదరు మహిళా రైతుకు నేను హెలికాప్టర్ అయితే ఇప్పించలేను. కానీ కచ్చితంగా ఆమె సమస్యను పరిష్కరిస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాదు వెనువెంటనే సంబంధిత తహసిల్ అధికారులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులను కూడా మహిళా రైతు సమస్యపై వివరణ అడిగారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more