అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ జర్మనీకి చెందిన మరో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోఎన్ టెక్ తో కలసి సంయుక్తంగా అభివృద్ది చేసిన కరోనా వాక్సీన్ కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత డిసెంబర్ నెలలో భారత డ్రగ్ కంటోలర్ అధారిటీ వద్ద పెట్టుకున్న దరఖాస్తును ఆకస్మికంగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఔషధ సంస్థ వెల్లడించింది. భారత్ లో కరోనా టీకా వినియోగానికి దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ ఫైజరే కావడం గమనార్హం.
అయితే భారత్ ఔషధ నియంత్రణ మండలి అధికారులతో జరిగిన భేటీ అనంతరం తాము తమ ధరఖాస్తును ఉపసంహరించుకున్నామని ఫైజర్ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. యూకే, బహ్రైన్ లలో అనుమతి రాగానే ఫైజర్ భారత్ పై ఆసక్తి చూపింది. డిసెంబర్ నెలలోనే ఈ మేరకు ధరఖాస్తు చేసుకుంది. అయితే ఫైజర్ దరఖాస్తుపై ఔషధ నియంత్రణ మండలికి చెందిన నిపుణుల కమిటీ ఫిబ్రవరి 3న సమీక్ష నిర్వహించింది. వాక్సీన్ భద్రతపై ఇంకా అదనపు సమాచారం కావాలని కంపెనీ ప్రతినిధులకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ వెల్లడించింది.
భారత్ ఔషద నియంత్రంణ మండలి నిపుణుల కమిటీ కోరిన సమాచారం అందుబాటులోకి రాగానే మరోసారి దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. భారత ప్రజలకు కొవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. కొవిడ్ నిరోధం కోసం తయారు చేసిన టీకాను దిగుమతి చేసుకునేందుకు అనుమతి కోరింది. అలాగే భారత్ లో క్లినికల్ పరీక్షలు తప్పనిసరిగా జరపాలన్న నిబంధనన నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరించని నిపుణుల కమిటీ మరింత సమాచారంతో రావాలని స్పష్టం చేసింది.
జర్మనీ సంస్థకు చెందిన బయో ఎన్ టెక్ సంస్థతో కలసి సంయుక్తంగా కోవిడ్ టీకా అభివృద్ది చేసిన ఫైజర్.. తద్వారా ఏకంగా 15 బిలియన్ డాటర్ల(భారత కరెన్సీలో ఏకంగా రూ. లక్ష 94 వేల కోట్లు) అధాయాన్ని కూడా అర్జించాలని అంచనా వేసింది. ఈ మేరకు తమ పూర్తి లాభాల అంచనాను అవిష్కరించింది. కరోనా వాక్సీన్ నేపథ్యంలో ఈ ఏడాది తమ సంస్థ విక్రమాలు ఏకంగా 59.4 బిలియన్ డాలర్ల నుంచి 61.4 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ వాక్సీన్ ను అత్యవసర ఔషదం కింద పరగణించి విక్రయాలు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more