అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన ప్రతీసారి ఎలాంటి సంకోచం లేకుండా ఉన్నపళంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రప్రభుత్వ అనుమతిలో పెంచేస్తున్న ఇంధన సంస్థలు మరోసారి ధరలను పెంచి వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల తగ్గింపు విషయమై కేంద్ర,రాష్ట్రలు విధిస్తున్న పన్నులు కాసింత ఉపసంహరించుకుంటే తప్ప వాహనదారులకు ఉపశమనం లభించదని కూడా సూచిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందని రాష్ట్రాలు.. రాష్ట్రాలు తగ్గిస్తాయని కేంద్రం ఎదరుచూస్తూ.. వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి.
కాగా ధరలు తగ్గిన సమయాల్లో మాత్రం ఆ ప్రయోజనాలను వాహనదారులకు అందకుండా మధ్యలో దేశాభివృద్దికి కోసమని కేంద్రం, రాష్ట్రాభివృద్దికని రాష్ట్రప్రభుత్వాలు ఎక్సైజ్ సన్నులు, వ్యాట్ లు విధిస్తూ.. కొత్త మార్గాలను అనుసరిస్తూ అందుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వాలు.. ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించకుండా ఎక్సైజ్ డ్యూటీ చార్జీలను పెంచుతూ అదాయావనురుగా మార్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.
ఓ వైపు ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో కేంద్రం అటో రంగం వేగాన్ని అందుకునేందుకు చర్యలను తీసుకుంటామంటూనే.. ఇంధన ధరలను పెంచేయడం.. వాహనాల విక్రయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక తాజాగా పెంచిన ఇంధన ధరలతో హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. ఏకంగా పెట్రోల్ లీటరు ధర రూ.90 దాటి పరుగులు పెడుతోంది. ఇది ప్రీమియం పెట్రోల్ ధర కాదు.. సాధారణ పెట్రోల్ ధర. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై అయిదు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.
తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.86.95కు చేరగా, డీజిల్ రూ.77.13
కోల్ కతాలో లీటరు పెట్రోలు రూ.88.30కు చేరగా, డీజిల్ రూ. 80.71
ముంబైలో లీటరు పెట్రోలు రూ.93.49కు చేరగా, డీజిల్ రూ.83.99
చెన్నైలో లీటరు పెట్రోలు రూ.89.39కు చేరగా, డీజిల్ రూ.82.33
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ.90.42కు చేరగా, డీజిల్ రూ.84.14
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.91.24కు చేరగా, డీజిల్ రూ. 84.84
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more