తెలంగాణలోని సూర్యపేట, వికారాబాద్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సూర్యాపేటలో వందలాది కోళ్లు మృత్యవాత పడ్డాయి. గత వారం రోజులుగా ఈ విషయాన్ని అక్కడి ఫౌల్ట్రీల యాజమాన్యాలు గుర్తిస్తున్నాయి. కాగా క్రితం రోజున పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో పశుసంవర్థక శాఖ రంగంలోకి దిగింది. మరణించిన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి పూనేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. ఫారాలలో కోళ్లు మరణించడం అన్నది సాధారణంగా చోటుచేసుకునే విషయమే అయినా.. వాటిని పరీక్షించి వాటికి బర్డ్ ప్వూ సోకిందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించేందకు పంపారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని నెలల క్రితం బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. చికెన్ రేట్లు అమాంత తగ్గి నేల చూపులు చూస్తున్న తరుణంలో తెలంగాణలో ఎక్కడా బర్డ్ ప్లూ లేదని.. ప్రభుత్వం, అధికారులు స్పష్టమైన హామీలను ఇవ్వడంతో చికెన్ అమ్మకాలకు మళ్లీ డిమాండ్ వచ్చింది. ఇక తాజాగా అటు సూర్యాపేట, ఇటు వికారాబాద్ జిల్లాలలో వేలాది కోళ్లు మరణించడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లాలో కోళ్లతో పాటు కాకులకు వింత వ్యాధి సోకుతుండడం అలజడి రేపుతోంది.
వందలాది కోళ్లుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకులు కూడా ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దారూర్, యాలాల మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయని తెలిపారు. అయినప్పటికీ, అధికారులు చనిపోయిన కోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతుండడంతో స్థానికులు వాటిని పాతిపెట్టకుండా బయట పడేస్తున్నారు. దీంతో వాటిని తింటోన్న కాకులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. వారం రోజులుగా కోళ్లు, కాకులు చనిపోతున్నాయని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more