వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు అంతర్జాతీయ సెలబ్రిటీలు.. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్. వీరికి తోడు పలువురు ప్రపంచ సెలబ్రిటీలు కూడా గొంతు కలిపి మద్దతును ప్రకటించడంతో.. ఇప్పటీ అంశం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. క్రమేనా ప్రపంచం ప్రఖ్యాతి చెందిన పలువురి ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. దీనిపై ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నోరు విప్పుతున్నాయి.
రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న నిరసనోద్యమానికి తొలత మద్దతు ప్రకటించారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ త్రూడో. కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ విషయమై స్పందించారు. అయితే ఈయన స్పందించిన తరువాత ఈ అంశంపై ఇతర దేశాల ప్రధానులు కానీ, విదేశాంగ మంత్రులు కానీ స్పందించలేదు. దీంతో రైతుల నిరసనకు ఒక్క కెనడా ప్రధాని మాత్రమే స్పందించారని భావిస్తున్న తరుణంలో తాజాగా రిహన్నా స్పందించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో ఉన్నవారితో పాటు కళా రంగంలో ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
భారత్ లో రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ ఆర్టికల్ ను ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె.. ‘‘మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు. కాగా, కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఏడుగురు లామేకర్స్ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోకు లేఖ రాశారు. రైతుల సమస్యపై భారత్ తో చర్చించాలని వాళ్లు లేఖలో కోరినట్లు సమాచారం. ఇక, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్బర్గ్ కూడా రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘మేము రైతులకు సంఘీభావంగా నిలబడతాం’ అంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వార్తకు సమాధానంగా ట్వీట్ పెట్టారు.
రిహన్నా ట్వీట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన బ్రిటన్ ఎంపీ క్లౌడియా ‘‘భారత రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. రాజకీయ నాయకత్వం లోపించిన తరుణంలో ఇతరులు ముందుకు రావడం అభినందనీయం. రిహన్నాకు ధన్యావాదాలు’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. దీంతో హస్తిన శివార్లలోని రైతుల ఉద్యమం ఇతర దేశాల్లోనూ వైరల్ గా మారింది. రైతు ఉద్యమంపై వీరు స్పందించడం పట్ల ఇండియా నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ అంతర్గత విషయాల గురించి బయటి వ్యక్తులు మాట్లాడటం ఏంటని ప్రభుత్వ అనుకూలురు మండిపడుతుండగా, సామాజిక బాధ్యతతో స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ ప్రముఖుల ట్వీట్లపై మండిపడ్డ విదేశాంగ శాఖ
సెలెబ్రెటీల ట్వీట్లుపై భారత విదేశాంగ శాఖ భగ్గుమంది. వాటికి ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more