కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన పరిణామాలు ఓ వైపు రైతులను బాధిస్తున్న తరుణంలోనే సింఘు, టెక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలకు చెందిన స్థానికులుగా చెప్పుకుంటున్న పలువురు రైతులను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా డిమాండ్ చేయడం.. అంతేకాక వారి గూడారాలను తొలగించడం.. వారిపై రాళ్లు రువ్వి దాడులు చేశారు.
స్థానికులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో గుమ్మిగూడి రైతులపై తిరగబడి అక్కడి నంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో క్రితంరోజు సాయంత్రం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. తమపై రాళ్ల రువ్విన వారిపై రైతులు కూడా ప్రతిగా తిరిగబడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే స్థానికులుగా పేర్కోంటూ వచ్చిన వారిపై పోలీసులు లాఠీ చార్జీలు చేశారు. ఈ క్రమంలో రైతులను కూడా పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రం నుంచి కూడా రైతులకు సహాయ నిరాకరణ జరగుతోంది. వారికి అందే కనీస సౌకర్యాలను అందకుండా చేస్తూ.. వారు నిరసనలను వదిలేసి వెళ్లేలా ఒత్తిడి తీసుకువస్తోంది.
రైతులను అటు కేంద్రం ఇటు స్థానికులు టార్గెట్ చేశారని వారిని దీక్షాస్థలి వదిలి వెళ్లేలా చేస్తున్నారని తెలుసుకున్న పరిసర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాకలు చేరుకుంటున్నారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన రైతులు ఆరు నెలలకు కావాల్సిన అహార పదార్థాలతో నిరసన ప్రాంతాలకు తరలివస్తున్నారు. దీంతో సింఘు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హస్తినలో గత మూడేళ్లుగా తిష్టవేసి నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావంగా కదిలివస్తున్న వేలాది మంది రైతన్నలను అదుపు చేయడం పోలీసులకు శిరోభారంగా మారింది.
దీంతో దేశరాజధానికి చేరుకుంటున్న రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే రైతులకు రైతులు మాత్రమే మిత్రులని.. చాటేలా ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెలాది మంది రైతులు ఘాజీపూర్ చేరుకుని దీక్షకు దిగిన రైతులకు మద్దతు ప్రకటించారు. కాగా దేశరాజధాని ఢిల్లీని, ఉత్తర్ ప్రదేశ్ ను కలిపే ఘాజీపూర్ సరిహద్దుల్లో అక్కడి ప్రభుత్వాలు ఇంటెర్నెట్ సేవలను రద్దు చేశాయి. రైతులకు మద్దతుగా ముజాఫర్ నగర్ నుంచి కూడా వేలాది మంది రైతులు దీక్షాస్థలికి చేరుకోనున్నారని సమాచారం,
ముజాఫర్ నగర్ లో వేలాది మంది రైతులు కిసాన్ మహాపంచాయత్ పేరిట గుమ్మిగూడి సమావేశాలు నిర్వహించుకున్నారు. వారంతా రైతులకు మద్దుతు ప్రకటించారు. భారత కిసాన్ యూనియన్ నేతృత్వంలో సమావేశమైన రైతులు ఢిల్లీ చేరుకుని రైతులకు సంఘీబావంగా ఘాజీపూర్ చేరుకుని దీక్షా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలోనే హస్తినకు చేరుకునేందుకు హర్యానా రైతులు కూడా సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14 జిల్లాల్లో అంతర్జాల సేవలను ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో లేకుండా చేసింది అక్కడి బీజేపి ప్రభుత్వం.
దీంతో హర్యానా రాష్ట్రంలో మొత్తంగా 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడింది. హర్యానాలోని అంబాటా యుమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, పానిపట్, హిస్సార్, జింద్, రోహ్ తక్, భివాణీ, ఛక్రీ దాద్రీ, ఫతేహ్ బాద్, రివారీ, సిర్సా జిల్లాలో అంతర్జాల సేవలకు రైతుల ఉద్యమం నేపథ్యంలో నిలిపివేయబడ్డాయి. ఇదిలావుండగా, జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నేడు సద్భావన దినం పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు ఉపవాస దీక్షచేపట్టనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more