పెద్దలు చెవి దెగ్గర గూడు కట్టుకునేట్లుగా చెబుతుంటారు. ప్రమాదాల నివారణలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతీ జాతీయ రహదారిపైన.. ఈ మధ్య టోల్ ప్లాజాలపైనా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా నిదానమే ప్రధానము.. అంటూ రాస్తున్నారు. అయినా యువతలో నిదానమన్న లక్షణాలు లేకుండా పోతున్నాయి. దీంతో నిండు నూరేళ్లు చల్లగా బతకాల్సిన యువకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరికోందరు అవయవాలు పోగొట్టుకుని అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇన్నింటీకి వేగమే కారణమని తెలిసినా.. వేగం కోసం ప్రాణాలను పనంగా పెడుతున్నారు.
అయితే అదృష్టవంతులు మాత్రం కొద్దిలో తప్పించుకుంటున్నారు. లక్ వున్నంత వరకే ఇలా మరి లాక్ కలసి రానప్పుడు ఏంటీ..? అన్న ప్రశ్న ఉదయించక మానదు. అయితే నిదానంగా వెళ్తే ఎంతటి ప్రమాదం నుంచైనా చక్కగా తప్పించుకోవచ్చునన్న విషయం తెలియాల్సిందే. ఇక మరీ ముఖ్యంగా రైల్వే గేట్ పడిన తరువాత దాని కింద నుంచో లేక పక్క నుంచో చటుక్కున వచ్చేసి రైలు వచ్చేలోపు దాటి వెళ్లిపోదామనుకునేవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఇలాంటి ఘటనల్లో ప్రమాదాలు ఎంత భయంకరంగా వుంటాయో కూడా తెలిసినా.. చూసినా.. ఇలా దాటేవారిలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.
ఇలా తనకేం జరుగుతుంది అన్న భావనతో వున్న ఓ యువకుడు.. బైక్ పై రైల్వే గేటు వేసి వున్నా.. దానిని దాటుకుని ఏకంగా పట్టాల వద్దకు వచ్చి దాటేందుకు ప్రయత్నించినంతలో వైగంగా దూసుకువస్తున్న రైలును చూసి ఆగాడు. అయితే బైక్ ఇంజన్ ను మాత్రం ఆపలేదు. దీంతో బైక్ యాక్సిరలేటర్ పై చేయి పడి బైక్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. అంతే బైక్ రైలు పట్టాలపై పడింది. దీంతో వెనక్కు లాగుదామని ప్రయత్రించే లోపు రైలు రానే వచ్చింది. దీంతో భయంతో యువకుడు వెనక్కు జరిగాడు. రైలు వేగానికి బైక్ మరింత ముందుకు జరిగింది.
దీంతో రైలు చక్కాల కిందకు వెళ్లేలేక దాని వేగానికి అక్కడే వున్న స్థంబానికి తగిలింది. ఆ వెంటనే చక్కని బైక్ కాస్తా పదహారు ముక్కలైంది. ఇది చూసిన యువకుడు తలపై చేయి పెట్టుకున్నాడు. అప్పుడు కానీ యువకుడికి నిధానమే ప్రధానమంటే తెలిసిరాలేదు అనుకుంటా. రైల్వే గేటు వేసిన తరువాత దానిని దాటుకుని లోనిక వచ్చి.. రైలు పట్టాలపైకి చేరుకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్న విషయం బోధపడలేదు. ఇక తన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో కూడా యువకుడికి అర్థమయ్యివుండదు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రైల్వేగేట్ వద్ద జరిగింది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేయ్యండీ..!
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more