వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని మార్చడంతో పాటు సేవలను అందించడంలోనూ నూతన నిబంధనలను తీసుకుని రావడంలో ప్రకటించిన మార్పులు ఇప్పుడు ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాట్సాప్ బుజినెస్ లో తీసుకువచ్చిన మార్పులతో దేశీయ, అంతర్జాతీయ, బహుళజాతీ సంస్థలు అనేకం తమ ఉద్యోగులు, సిబ్బందికి ఇక వాట్సాప్ వినియోగంతో దూరంగా వుండాలని అదేశాలను కూడా జారీ చేశాయి.
టాటా స్టీల్ సహా పలు దేశీయ సంస్థలు, వాట్సప్ పై తాజాగా అదేశాలను జారీచేశాయి. అంతేకాదు.. ముఖ్యంగా అత్యంత విశ్వసనీయ సమాచారంతో పాటు కీలక, సున్నితమైన బిజినెస్ కాల్స్ కు వాట్సప్ వాడొద్దని చెబుతున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీసు నిబంధనల ఆధారంగా వాట్సాప్ తమ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో డేటా షేర్ చేసుకుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ నుంచి కీలక సమాచారం బయటి వ్యక్తులకు కూడా చేరుతుందన్న అందోళనలు వ్యక్తమవుతున్నాయి, దీనిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టెంట్లు.. కంపెనీలు తమ ఉద్యోగులకు వాట్సప్ ను దూరంగా ఉంచాలని చెప్పమంటున్నారు.
ఇక వాట్సాప్ ప్రైవసీ పాలసీని మార్చిందన్న వార్తలతో పాటు సేవల కోనసాగింపులోనూ నూతన నిబంధనలు తీసుకురావడంపై ఇప్పటికే భారత వ్యాపారస్థుల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తాయి, కేంద్రం వాట్పాఫ్ పై నిషేధం విధించాలని వ్యాపారసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశం కానున్న పార్లమెంటరీ కమిటీ వాట్సప్ ప్రైవసీ అప్ డేటా పై చర్చించేందుకు రెడీ అయింది. దీంతో అప్రమత్తమైన టాటా స్టీల్ తమ ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు, బిజినెస్ సమావేశాలు వాట్సప్ ద్వారా పంపొద్దని సూచిస్తుంది. ఇక ఇప్పటికే పలు దేశీయ, బహుళ జాతీ సంస్థలు కూడా ఈ విషయమై స్పందించాయి. తమ ఉద్యోగులకు వాట్సాప్ నుంచి దూరంగా వుండాలని సూచనలు జారీ చేశాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more