జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ కెప్టెన్ ఎన్కౌంటర్ చేసిన ఘటన విధితమే. అయితే వీరు ఉగ్రవాదులని.. అందుకనే వారి మాటు వేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఘటన అనంతరం ఆర్మీ అధికారులు పేర్కోన్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఇది ఆర్మీ అధికారులు పథకం ప్రకాం చేసిన ఎన్ కౌంటర్ అని పేర్కోంటున్నారు, ఇదే ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేస్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అందులో ఆర్మీ అధికారులపై అభియోగాలు కూడా మోపారు, ఆర్మీ అధికారులు కేవలం రూ.20లక్షల రివార్డు మనీ కోసమే ఈ ఘటనకు పాల్పడి దానిని ఎన్ కౌంటర్ గా అభివర్ణించారని, అయితే ఆర్మీ అధికారులు ఎన్ కౌంటర్ లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదని వారు పేర్కోంటున్నారు, ఈ మేరకు చార్జీషీటులో వారు ఆర్మీ అధికారులపై అభియోగాలను మోసారు, ‘ఆ ఎన్కౌంటర్ను ప్రస్తావిస్తూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్ (62RR) మరో ఇద్దరు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడి సాక్ష్యాలు తారుమారుచేశారు. కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైజ్ మనీ రూ.20లక్షలు దక్కించుకోవాలని ప్లాన్ చేశారు’ అని పోలీస్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
రాజౌరీకి చెందిన యువకులు ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రార్ లను షోపియన్ జిల్లాలోని అంశీపురాలో టెర్రరిస్టులంటూ ముద్రవేసి ఎన్ కౌంటర్ చేశారని తేలింది. షోపియన్ ఎస్పీ అమృత్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఛార్జి షీట్ అనేది ప్రస్తుతం కోర్ట్ ప్రాపర్టీ.. వారికి కావాలంటే బయటపెడతారు లేదంటే లేదు అని చెప్పారు. కెప్టెన్ భూపేంద్ర సింగ్, తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోనె పేర్లను 14వందల పేజీల ఛార్జి షీట్ లో ఫైల్ చేసి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఆ ఘటన జరిగిన తర్వాతనే ఆ ప్రదేశానికి పలు డైరక్షన్లలో తాము చేరుకున్నామని పేర్కోన్న ఆర్మీ అధికారులు.. ఆ తర్వాత ఏదో శబ్దం వచ్చిందని అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్నామని చెబుతున్నారు. నిజానికి ముందుగా అంతా కలిసే ఎన్కౌంటర్ చేశామని చెప్పినా.. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ను అతిక్రమించి ప్రవర్తించారని అధికారులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more