జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ కెప్టెన్ ఎన్కౌంటర్ చేసిన ఘటన విధితమే. అయితే వీరు ఉగ్రవాదులని.. అందుకనే వారి మాటు వేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఘటన అనంతరం ఆర్మీ అధికారులు పేర్కోన్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఇది ఆర్మీ అధికారులు పథకం ప్రకాం చేసిన ఎన్ కౌంటర్ అని పేర్కోంటున్నారు, ఇదే ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేస్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అందులో ఆర్మీ అధికారులపై అభియోగాలు కూడా మోపారు, ఆర్మీ అధికారులు కేవలం రూ.20లక్షల రివార్డు మనీ కోసమే ఈ ఘటనకు పాల్పడి దానిని ఎన్ కౌంటర్ గా అభివర్ణించారని, అయితే ఆర్మీ అధికారులు ఎన్ కౌంటర్ లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదని వారు పేర్కోంటున్నారు, ఈ మేరకు చార్జీషీటులో వారు ఆర్మీ అధికారులపై అభియోగాలను మోసారు, ‘ఆ ఎన్కౌంటర్ను ప్రస్తావిస్తూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్ (62RR) మరో ఇద్దరు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడి సాక్ష్యాలు తారుమారుచేశారు. కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైజ్ మనీ రూ.20లక్షలు దక్కించుకోవాలని ప్లాన్ చేశారు’ అని పోలీస్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
రాజౌరీకి చెందిన యువకులు ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రార్ లను షోపియన్ జిల్లాలోని అంశీపురాలో టెర్రరిస్టులంటూ ముద్రవేసి ఎన్ కౌంటర్ చేశారని తేలింది. షోపియన్ ఎస్పీ అమృత్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఛార్జి షీట్ అనేది ప్రస్తుతం కోర్ట్ ప్రాపర్టీ.. వారికి కావాలంటే బయటపెడతారు లేదంటే లేదు అని చెప్పారు. కెప్టెన్ భూపేంద్ర సింగ్, తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోనె పేర్లను 14వందల పేజీల ఛార్జి షీట్ లో ఫైల్ చేసి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఆ ఘటన జరిగిన తర్వాతనే ఆ ప్రదేశానికి పలు డైరక్షన్లలో తాము చేరుకున్నామని పేర్కోన్న ఆర్మీ అధికారులు.. ఆ తర్వాత ఏదో శబ్దం వచ్చిందని అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్నామని చెబుతున్నారు. నిజానికి ముందుగా అంతా కలిసే ఎన్కౌంటర్ చేశామని చెప్పినా.. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ను అతిక్రమించి ప్రవర్తించారని అధికారులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more