పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్ పై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ కు మంచినీటి బాటిల్ లో విషపూరిత రసాయనం కలిపి ఇచ్చారన్న వార్తలు గుప్పుమనడంతో సీబీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విషపూరిత తాగునీటి బాటిల్ అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ నీటిని సరఫరా చేసిన కంపెనీతో పాటు నీటిని టేబుల్ పై ఏర్పాటు చేసిన సిబ్బంది వరకు అందరిపై నిఘా పెటి దర్యాప్తు చస్తున్నారు. ఆ ఒక్క బాటిల్ లోనే విషపూరిత రసాయనం కలిసిందా.? లేక అలాంటి బాటిళ్లు ఇంకా వున్నాయా.? అన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తోంది సిబిసిఐడి. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..
తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కక్షసాధింపు చర్యలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాల్పడుతోందని అరోపిస్తూ.. అమె వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో రాజ్ నివాస్ ఎదుట నిన్న ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రాజ్ నివాస్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గోంటున్న అందోళన కార్యక్రమం కావున జాగ్రత్త చర్యలపై సమావేశంలో అధికారలు చర్చించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులకు అంచెలవారీగా భద్రతా కల్పించాలని చర్చించారు.
కాగా, సమావేశంలో పాల్గొన్న అధికారులకు ‘స్విస్ ఫ్రెష్’ అనే ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి బాటిళ్లను సిబ్బంది అందించారు. మంచి నీళ్లు తాగేందుకు కలెక్టర్ పూర్వగార్గ్ బాటిల్ మూత తెరవగానే ఏదో రసాయనం కలిపిన వాసన వచ్చింది. దీంతో అనుమానించిన ఆమె ఆ నీటిని తాగకుండా అధికారులకు అప్పగించి విషయం చెప్పారు. విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ కు ఇచ్చిన బాటిల్ తప్ప మిగతా సీసాల్లో స్వచ్ఛమైన నీరే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డీజీపీ బాలాజీ శ్రీవాస్తవ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్టు బేడీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more