పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్ పై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ కు మంచినీటి బాటిల్ లో విషపూరిత రసాయనం కలిపి ఇచ్చారన్న వార్తలు గుప్పుమనడంతో సీబీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విషపూరిత తాగునీటి బాటిల్ అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ నీటిని సరఫరా చేసిన కంపెనీతో పాటు నీటిని టేబుల్ పై ఏర్పాటు చేసిన సిబ్బంది వరకు అందరిపై నిఘా పెటి దర్యాప్తు చస్తున్నారు. ఆ ఒక్క బాటిల్ లోనే విషపూరిత రసాయనం కలిసిందా.? లేక అలాంటి బాటిళ్లు ఇంకా వున్నాయా.? అన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తోంది సిబిసిఐడి. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..
తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కక్షసాధింపు చర్యలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాల్పడుతోందని అరోపిస్తూ.. అమె వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో రాజ్ నివాస్ ఎదుట నిన్న ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రాజ్ నివాస్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గోంటున్న అందోళన కార్యక్రమం కావున జాగ్రత్త చర్యలపై సమావేశంలో అధికారలు చర్చించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులకు అంచెలవారీగా భద్రతా కల్పించాలని చర్చించారు.
కాగా, సమావేశంలో పాల్గొన్న అధికారులకు ‘స్విస్ ఫ్రెష్’ అనే ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి బాటిళ్లను సిబ్బంది అందించారు. మంచి నీళ్లు తాగేందుకు కలెక్టర్ పూర్వగార్గ్ బాటిల్ మూత తెరవగానే ఏదో రసాయనం కలిపిన వాసన వచ్చింది. దీంతో అనుమానించిన ఆమె ఆ నీటిని తాగకుండా అధికారులకు అప్పగించి విషయం చెప్పారు. విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ కు ఇచ్చిన బాటిల్ తప్ప మిగతా సీసాల్లో స్వచ్ఛమైన నీరే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డీజీపీ బాలాజీ శ్రీవాస్తవ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్టు బేడీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more