CBCID to probe ‘toxic liquid’ for Puducherry collector జిల్లా కలెక్టర్ పై విష ప్రయోగం.. నీళ్ల బాటిల్ లో విష రసాయనం..

Staff serves toxic liquid in mineral water bottle to puducherry collector fir registered

purva garg, ias purva garg, puducherry, poisonous liquid to purva garg, toxic liquid, Puducherry, puducherry district collector, 'poisonous liquids', water bottle, district officials meet, Crime

Shocking news has surfaced from the Union Territory of Puducherry, where the district collector was given 'poisonous liquids' instead of water in a water bottle during a meeting. The incident happened with Purva Garg, the District Magistrate of Puducherry while she was having a meeting. This poisonous fluid was transparent like water.

జిల్లా కలెక్టర్ పై విష ప్రయోగం.. నీళ్ల బాటిల్ లో విష రసాయనం..

Posted: 01/09/2021 10:20 AM IST
Staff serves toxic liquid in mineral water bottle to puducherry collector fir registered

పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్ పై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ కు మంచినీటి బాటిల్ లో విషపూరిత రసాయనం కలిపి ఇచ్చారన్న వార్తలు గుప్పుమనడంతో సీబీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విషపూరిత తాగునీటి బాటిల్ అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ నీటిని సరఫరా చేసిన కంపెనీతో పాటు నీటిని టేబుల్ పై ఏర్పాటు చేసిన సిబ్బంది వరకు అందరిపై నిఘా పెటి దర్యాప్తు చస్తున్నారు. ఆ ఒక్క బాటిల్ లోనే విషపూరిత రసాయనం కలిసిందా.? లేక అలాంటి బాటిళ్లు ఇంకా వున్నాయా.? అన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తోంది సిబిసిఐడి. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..

తమ ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కక్షసాధింపు చర్యలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాల్పడుతోందని అరోపిస్తూ.. అమె వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో రాజ్ నివాస్ ఎదుట నిన్న ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రాజ్ నివాస్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గోంటున్న అందోళన కార్యక్రమం కావున జాగ్రత్త చర్యలపై సమావేశంలో అధికారలు చర్చించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులకు అంచెలవారీగా భద్రతా కల్పించాలని చర్చించారు.

కాగా, సమావేశంలో పాల్గొన్న అధికారులకు ‘స్విస్ ఫ్రెష్’ అనే ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి బాటిళ్లను సిబ్బంది అందించారు. మంచి నీళ్లు తాగేందుకు కలెక్టర్ పూర్వగార్గ్ బాటిల్ మూత తెరవగానే ఏదో రసాయనం కలిపిన వాసన వచ్చింది. దీంతో అనుమానించిన ఆమె ఆ నీటిని తాగకుండా అధికారులకు అప్పగించి విషయం చెప్పారు. విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ కు ఇచ్చిన బాటిల్ తప్ప మిగతా సీసాల్లో స్వచ్ఛమైన నీరే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డీజీపీ బాలాజీ శ్రీవాస్తవ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్టు బేడీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles