AP former minister Bhuma Akhila Priya held in kidnap case సీఎం బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్!

Ap former minister bhuma akhila priya held in kidnap case

Bhuma Akhila Priya, Bhargava Ram, Bowenpally, CCTV footage, Kidnap case, Hockey player Praveen Rao, Praveen Rao kidnap case, Bowenpally, Allagadda, Kurnool, Hyderabad, Hyderabad latest news, Telangana, Crime news

Andhra Pradesh former minister Bhuma Akhila Priya and her husband Bhargava Ram have been arrested by the police in the cases related o the kidnap of Praveen Rao and his two brothers. Akhila Priya is said to have been taken to the Begumpet women police station for an investigation.

సీఎం బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్!

Posted: 01/06/2021 09:35 PM IST
Ap former minister bhuma akhila priya held in kidnap case

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని మనోవికాస్ నగర్ కు చెందిన సీఎం బందువుల ఇంటికి ఐటీ అధికారుల పేరుతో చోరబడిన అగంతకులు ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను సినీపక్కిలో నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు, కాగా వారి బంధువలు పిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపగా, ముగ్గురినీ వికారాబాద్ లో గుర్తించి.. కిడ్నాపర్ల నుంచి రక్షించారు, వారంతా సురక్షితంగా వున్నారని పోలీసులు తెలిపారు, దీంతో సీఎం బంధువుల కిడ్నాప్ కేసు సుఖాంతమైంది.

కాగా, ఈ కేసులో మొత్తం ఘటన వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియను అరెస్టు చేయగా, భూవ్యవహారానికి సంబంధించే ఈ ఘటన చోటుచుసుకున్నట్లు తెలుస్తోంది, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సీఎం బంధువుల ఇంటికి మూడు కార్లలో వచ్చిన దుండగులు ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమతో రావాలని వారిని కార్లలో తీసుకెళ్లారు, వారితో పాటు ల్యాప్ టాప్‌, మొబైల్ ఫోన్ల కూడా స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు ఐటీ అధికారులు అదుపులోకి ఎలా తీసుకుంటారని, ఇది కిడ్నాప్ అని అనుమానంతో హైదరాబాద్‌ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు సీపీ అంజనీకుమార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రత్యేక బృందాలను, టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ప్రవీణ్ రావు కిడ్నాపైన విషయం తెలియడంతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles